Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అల వైకుంఠపురములో' చిత్రం రూపొందుతుంది. గీతా ఆర్ట్స్, హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకాలపై అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మొదటి పాట 'సామజవరగమన..' విడుదలై విశేషంగా ఆకట్టుకుంది. యూట్యూబ్లోనూ ట్రెండ్ అయ్యింది.
ఆ విశేషాలను చిత్ర బృందం చెబుతూ, 'సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన ఈ గీతానికి తమన్ స్వరాలు సమ్మోహన పరుస్తున్నాయి. గాయకుడు సిద్ శ్రీరామ్ పాడగా, ప్రస్తుతం ఇది విశేష ఆదరణ పొందుతోంది. పాట విడుదలైన 24 గంటల్లో 6 మిలియన్ వ్యూస్, 313 లైక్స్ రావడం విశేషం. తెలుగులో మొదటిసారి ఫస్ట్ సింగల్కు ఇన్ని వ్యూస్, లైక్స్ రావడం హర్షించదగ్గ విషయం. ఇప్పటివరకు ఈ పాటకు 40 మిలియన్స్ వ్యూస్, 7 లక్షల లైక్స్ వచ్చాయి. తెలుగులో ఒక సాంగ్కు ఇన్ని లైక్స్, వ్యూస్ రావడం ఇదే ప్రథమం. దీంతో ఇది సినిమాపై భారీ క్రేజ్ని పెంచుతుంది. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా సినిమా రూపొందుతుంది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది' అని తెలిపింది. టబు, రాజేంద్రప్రసాద్, సచిన్ ఖేడ్ కర్, తనికెళ్ళ భరణి, మురళీ శర్మ, సముద్ర ఖని, జయరాం, సునీల్, నవదీప్, సుశాంత్, నివేతా పేతురాజ్, గోవిందా పద్మసూర్య, రోహిణి, ఈశ్వరీరావు, కల్యాణి నటరాజన్, శిరీష ,బ్రహ్మాజీ, హర్షవర్ధన్, అజయ్, పమ్మిసాయి, రాహుల్ రామకృష్ణ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: పి.ఎస్.వినోద్, సంగీతం: థమన్, ఎడిటర్: నవీన్నూలి, ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్.