Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అలనాటి 'పరమానందయ్య శిష్యుల కథ' తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఈ నేపథ్యంలో పింక్ రోజ్ సినిమాస్ పతాకంపై కాటంరెడ్డి సంతన్రెడ్డి, సి.హెచ్.కిరణ్ శర్మ నిర్మాతలుగా వెంకట రాజేష్ పులి దర్సకత్వంలో తెరకెక్కిన చిత్రం 'శ్రీ పరమానందయ్య శిష్యుల కథ'. తెలుగు సినిమా చరిత్రలో మొట్టమొదటి చిన్నారుల కోసం 3డి ఫార్మాట్లో తెరకెక్కిన ఈ సినిమా విడుదల సిద్ధం అవుతుంది. ఇటీవల ఈ సినిమా టీజర్ని డైరెక్టర్ మారుతీ విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, 'చిన్నారుల కోసం, పిల్లలకు నచ్చేలా ఇప్పుడున్న టెక్నాలజీతో మనందరికీ తెలిసిన పరమానందయ్య శిష్యుల కథను కొత్తగా చూపించే ప్రయత్నం చేసినందుకు చిత్ర బందానికి నా అభినందనలు. పిల్లలతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తారని ఆశిస్తున్నాను' అని తెలిపారు. 'త్వరలోనే ఈ సినిమాకి సంబందించిన మరిన్ని విషయాలు తెలియజేస్తాం. పరమానందయ్య శిష్యుల కథల్లో ఉన్న నీతిని చిన్నారులకు మరింతగా చేరవేయడం కోసం ఈ చిత్రాన్ని 3డిలో రెడీ చేస్తున్నాం' అని నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రానికి నిర్మాతలు : కాటంరెడ్డి సంతన్ రెడ్డి, సి హెచ్ కిరణ్ శర్మ, ఛాయాగ్రహణం : జి. ప్రభాకర్ రెడ్డి, కూర్పు : కార్తీక్ శ్రీనివాస్, సంగీతం : యాజమాన్య.