Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''యాక్షన్' చిత్రం విజువల్ ట్రీట్గా ఉండబోతుంది. విశాల్, తమన్నా చేసే పోరాట ఘట్టాలు మంత్రముగ్ధుల్ని చేస్తాయి. నాకు హ్యాట్రిక్ హిట్నిస్తుందని భావిస్తున్నా' అని అన్నారు శ్రీనివాస్ ఆడెపు. విశాల్, తమన్నా జంటగా, సుందర్ సి. దర్శకత్వంలో రూపొందిన 'యాక్షన్' చిత్రాన్ని శ్రీ కార్తికేయ ఫిల్మ్స్ పతాకంపై శ్రీనివాస్ ఆడెపు తెలుగులో విడుదల చేస్తున్నారు. నేడు(శుక్రవారం) సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత శ్రీనివాస్ మాట్లాడుతూ, 'నేను డైరెక్టర్ కావాలని ఇండిస్టీలోకి వచ్చాను. ఆ టైమ్లో ఎవరూ తెలియదు. బి.జయగారు రూపొందించిన 'గుండమ్మగారి మనవడు'కి అసోసియేట్ డైరెక్టర్గా చేశాను. స్క్రిప్ట్లు పట్టుకుని 'ఖడ్గం'లో రవితేజ తిరిగినట్టు తిరిగా. అనేక స్ట్రగుల్స్ పడ్డాను. ఎవరూ అవకాశం ఇవ్వలేదు. మన సినిమాని మనమే నిర్మించుకోవాలని, ఆర్థికంగా ఎదగాలని డిస్ట్రిబ్యూటర్గా మారాను. డిస్ట్రిబ్యూటర్గా ఒక్క జాక్పాట్ తగిలినా సినిమా నిర్మించొచ్చు అనుకున్నా. ఇటీవల డిస్ట్రిబ్యూటర్గా విడుదల చేసిన 'హుషారు' మంచి లాభాలు తెచ్చింది. 'గద్దలకొండ గణేష్' ఫర్వాలేదనిపించింది. 'ఇస్మార్ట్ శంకర్' బ్లాక్బస్టర్ అయ్యింది. డిస్ట్రిబ్యూటర్గా చాలా హ్యాపీగా ఉన్నా. ఆ తర్వాత మా బ్యానర్లోనే స్ట్రెయిట్ సినిమాకి ప్లాన్ చేశాం. ఇంతలో 'యాక్షన్' సినిమా రావడంతో రైట్స్ తీసుకున్నాం. ఈ చిత్ర టీజర్ విడుదలైనప్పుడు తెగ నచ్చింది. యాక్షన్, నిర్మాణ విలువలు, విజువల్స్ అద్భుతంగా అనిపించాయి. దీంతో అదే రోజు చెన్నై వెళ్ళి తెలుగు రిలీజ్ రైట్స్ తీసుకున్నా. విశాల్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్తో రూపొందిన చిత్రమిది. నేను కూడా భారీ రేట్కి కొన్నాను. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు నార్త్లో కూడా దాదాపు 600 థియేటర్లలో భారీ స్థాయిలో సినిమాని విడుదలకు ప్లాన్ చేశాను. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకం ఉంది. విశాల్ అద్భుతంగా నటించారు. అలాగే తమన్నా కూడా ఇందులో యాక్షన్ చేశారు. రిస్కీ షాట్స్ కూడా చేశారు. గ్లామర్తోనే కాదు, పోరాట ఘట్టాలతోనూ మెస్మరైజ్ చేస్తుంది. 'ఇస్మార్ట్ శంకర్' తర్వాత మాస్ సినిమా తెలుగులో రాలేదు. దాన్నిది భర్తీ చేసే చిత్రమవుతుంది. 'రుద్రవీణ', 'సాగర సంగమం' వంటి ఎమోషన్స్, వ్యాల్యూస్ ఉన్న సినిమాలంటే నాకు ఇష్టం. వాటి స్ఫూర్తితోనే ఇండిస్టీలోకి వచ్చాను. నేను దర్శకత్వం వహించబోయే సినిమాలు కూడా అలాంటి ఎమోషన్స్, రిలేషన్స్, హ్యూమర్, వ్యాల్యూస్ ప్రధానంగా ఉంటాయి' అని అన్నారు.