Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 'అలా వైకుంఠపురములో' చిత్రం రూపొందుతుంది. పూజా హెగ్డే కథానాయికగా, గీతా ఆర్ట్స్, హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ(చినబాబు) సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని ఇప్పటికే 'సామజవరగమన', 'రాములో రాముల' అంటూ సాగే రెండు పాటలు విడుదలై శ్రోతలను ఆకట్టు కుంటున్నాయి. తాజాగా 'ఓ మైగాడ్ డాడీ' అనే మూడోపాటని గురువారం విడుదల చేశారు. పాటకి మంచి స్పందన రావడమే కాదు, పాటకి అల్లు అర్జున్ కుమారుడు అల్లు అయాన్తోపాటు కుమార్తె అల్లు అర్హ కలిసి క్యూట్గా డాన్స్లు చేయడం హైలైట్గా నిలిచింది. బన్నీ ఇచ్చిన ఈ ప్రత్యేక సర్ప్రైజ్కి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఈ పూర్తి పాటని ఈ నెల 22న విడుదల చేయనున్నారు. బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాలో టబు, సుశాంత్, నివేదా పేతురాజ్, నవదీప్ వంటి భారీ తారాగణం నటిస్తోంది. ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నారు.