Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుజన్, తనీష్క్ జంటగా చలపతి పువ్వల దర్శకత్వంలో యు.కె.ఫిల్మ్స్ పతాకంపై ఉషారాణి కనుమూరి, విజయ్ రామకృష్ణం రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'అప్పుడు-ఇప్పుడు'. ఈ చిత్ర టీజర్ని శుక్రవారం దర్శకుడు పూరీ జగన్నాథ్ విడుదల చేశారు. సినిమా పెద్ద విజయం సాధించాలని చిత్ర యూనిట్కి ఈ సందర్భంగా ఆయన అభినందనలు తెలిపారు. దర్శకుడు చలపతి పువ్వల మాట్లాడుతూ, 'మా చిత్ర టీజర్ని పూరీ జగన్నాథ్ విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆయనకు ధన్యవాదాలు. ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. హీరో హీరోయిన్ కొత్తవారే అయినా పూర్తి సహకారం అందించారు. మేకింగ్లో రాజీపడకుండా తెరకెక్కించాం. కళ్యాణ్ సమి విజువల్స్, పద్మనావ్ భరద్వాజ్ సంగీతం సినిమాకు మంచి అసెట్ అయ్యాయి. సినిమా అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చింది. తప్పకుండా అందరికీ నచ్చుతుంది' అని అన్నారు. 'ఇప్పటికే విడుదలైన సాంగ్స్కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పుడు టీజర్తో ఇటు అభిమానుల్లో అటు ట్రేడ్ వర్గాల్లో మంచి బజ్ ఏర్పడింది. దర్శకుడు చలపతి పువ్వల కొత్తవారైనా అనుభవం కలిగిన దర్శకుడిగా తెరకెక్కించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్తోపాటు సెన్సార్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం' అని నిర్మాతలు తెలిపారు.