Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉదయ్ శంకర్, ఐశ్వర్య రాజేష్ జంటగా ఎన్.వి నిర్మల్ కుమార్ దర్శకత్వంలో అధిరో క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి పతాకంపై జి.శ్రీరామ్ రాజు, భరత్రామ్లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'మిస్మ్యాచ్'. విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం గురించి నిర్మాతలు మాట్లాడుతూ, 'ఇటీవల ప్రముఖ దర్శకుడు 'క్రిష్' చేతుల మీదుగా విడుదలైన సినిమా తొలి ప్రచార చిత్రాలు, విక్టరీ వెంకటేష్ విడుదల చేసిన చిత్రం టీజర్కి ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభించింది. సినిమా చాలా బాగా వచ్చింది. క్రీడా నేపథ్యం కలిగిన పాత్రలో, ఛాలెంజింగ్ రోల్లో ఐశ్వర్య కనిపిస్తారు. గిఫ్టన్ ఇలియాస్ సంగీతం, నేపధ్య సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణ కానున్నాయి. ఆడియెన్స్ కోరుకుంటున్న అన్ని అంశాలుంటాయి. డిసెంబర్ 6న విడుదలకు ప్లాన్ చేస్తున్నాం' అని అన్నారు. 'ఈ చిత్ర కథని భూపతి రాజా ఇచ్చారు. దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించిన విధానం ప్లస్ అవుతుంది. ప్రతిభగల ఆర్టిస్ట్ ఐశ్వర్య రాజేష్ పక్కన నేను నటించడం గ్రేట్ ఎక్స్ పీరియన్స్. చిత్ర కథ, కథనాలు ప్రేక్షకులను అలరిస్తాయి' అని హీరో ఉదరు శంకర్ తెలిపారు. దర్శకుడు ఎన్ వి. నిర్మల్ కుమార్ మాట్లాడుతూ, 'సరికొత్త కథ, కథనాలతో దర్శకుడిగా తెలుగులో పరిచయం అవుతున్నందుకు ఆనందంగా ఉంది. అందరికి సినిమా నచ్చుతుందని భావిస్తున్నా' అని చెప్పారు. 'ఒకమంచి కథ మిస్ చేసుకోకూడదని ఈ సినిమా చేశాను. నా పాత్ర కొత్తగా ఉంటుంది' అని ఐశ్వర్య రాజేష్ తెలిపారు. భూపతి రాజా మాట్లాడు తూ, 'రెండు కుటుంభాల మధ్య జరిగే కథ ఇది' అని అన్నారు.