Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఓ డిజార్డర్తో హీరోయిన్ బాధపడుతుంటుంది. తనకది ఓ రాహు లాంటిది. తన జీవితంలో మరో రాహు బయట ఉంటాడు. ఈ రెండు సమస్యలపై తాను ఎలాంటి పోరాటం చేసిందనేది తెలియాలంటే 'రాహు' చిత్రాన్ని చూడాల్సిందే' అని అంటున్నారు దర్శకుడు సుబ్బు వేదుల. అభిరామ్ వర్మ, కృతి గార్గ్ జంటగా 'కాలకేయ' ప్రభాకర్, చలాకీ చంటి, గిరిధర్, సత్యం రాజేష్, స్వప్నిక ప్రధాన పాత్రధారులుగా సుబ్బు వేదుల దర్శకత్వంలో 'రాహు' చిత్రం రూపొందుతుంది. ఏ.వి.ఆర్ స్వామి, శ్రీ శక్తి బాబ్జీ, రాజా దేవరకొండ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్ని గురువారం అతిథిగా విచ్చేసిన దర్శకుడు వీరుపోట్ల విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'చిత్ర ట్రైలర్ చాలా బాగుంది. కథ ఆసక్తికరంగా ఉంటుంది. కచ్చితంగా ఆడియెన్స్ ఆదరిస్తారనే నమ్మకం ఉంది. టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్' అని అన్నారు. 'ఇప్పుడు థ్రిల్లర్స్ యుగం నడుస్తోంది. ఒక పాటతో సినిమాలు ఆడియెన్స్లోకి వెళ్తున్నాయి. ఓపెనింగ్స్ తెస్తున్నాయి. సిధ్ శ్రీరామ్ పాడిన 'ఏమో..ఏమో.. ' పాట సినిమాకి మంచి హైప్ తెచ్చింది. చాలా కొత్తగా ఉండే కథ ఇది. సుబ్బు మంచి స్టోరీ టెల్లర్. మా మధుర ఆడియో ద్వారా పాటలు విడుదల కావడం ఆనందంగా ఉంది' అని మధుర శ్రీధర్ తెలిపారు. చిత్ర దర్శకుడు సుబ్బు వేదుల చెబుతూ, ''రాహు' అంటే ఇది జాతకాల స్టోరీ అనుకుంటున్నారు. కానీ మా స్టోరీ భిన్నమైనది. హై టెక్నికల్ వ్యాల్యూస్తో తెరకెక్కించాం. సపోర్ట్ చేసిన నిర్మాతలు, ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు ధన్యవాదాలు' అని తెలిపారు. 'ఓ మంచి టీమ్తో సినిమాని నిర్మించాం. టీజర్కి, పాటలకి మంచి రెస్పాన్స్ వస్తుంది. సినిమా అవుట్పుట్ మాకు సంతృప్తినిచ్చింది' అని నిర్మాతలు తెలిపారు.