Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''తెనాలి రామకృష్ణ' చిత్రాన్ని మేం కేవలం నవ్వించడం కోసమే తీశామని ముందు నుంచి చెబుతున్నాం. సినిమా ఆడియెన్స్ని నవ్విస్తుందని, ఎక్కడా బోర్ కొట్టకుండా ఉందని అంటున్నారు. షో, షోకి ఆడియెన్స్ పెరగడం చాలా సంతోషంగా ఉంది' అని సందీప్ కిషన్ అన్నారు. జి.నాగేశ్వర్రెడ్డి దర్శకత్వంలో సందీప్ కిషన్, హన్సిక జంటగా, జవ్వాజి రామాంజనేయులు సమర్పణలో అగ్రహారం నాగిరెడ్డి, శ్రీనివాస్, కె.సంజీవ్రెడ్డి సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'తెనాలి రామకృష్ణ బి.ఏ.బి.ఎల్'. శుక్రవారం సినిమా విడుదలైన నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో దర్శకుడు జి.నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, 'మా సినిమాని చూసి థియేటర్లో ఎంజారు చేస్తున్న ప్రేక్షకులందరికి థ్యాంక్స్. నవ్వించడానికి సినిమా తీశాం. ఆడియన్స్ అదే చేస్తున్నారు. సినిమాలో మంచి కామెడీ ఉంది, మ్యూజిక్ బాగుంది, ట్విస్ట్లు బాగున్నాయని అంటున్నారు. మాకు అదే చాలు. సినిమాకు వచ్చే రెస్పాన్స్తో మా యూనిట్ అంతా చాలా హ్యాపీగా ఉంది' అని అన్నారు. 'రివ్యూస్ని స్వాగతిస్తున్నా. నాకు వచ్చే కాల్స్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సినిమా ప్రేక్షకులను బాగా నవ్విస్తుందని. మా సినిమాకి సపోర్ట్ చేస్తున్న ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు' అని సందీప్ కిషన్ చెప్పారు. ఎడిటర్ చోటా కె ప్రసాద్ మాట్లాడుతూ, 'మార్నింగ్ షో నుంచి సినిమాకి పాజిటివ్ టాక్ వస్తుంది. చాలా మంది కాల్స్ చేసి బాగుందని చెబుతున్నారు. మేము హిట్ కొట్టామని గర్వంగా చెబుతున్నా' అని తెలిపారు. మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తీక్ మాట్లాడుతూ, 'సినిమాను ఇంత సక్సెస్ చేసిన ఆడియెన్స్కి థ్యాంక్స్. ఇందులో నటించిన నటీనటులు, టెక్నీషియన్లకు అభినందనలు' అని చెప్పారు. నిర్మాత సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ, 'సినిమా విడుదలైన అన్ని ఏరియాల నుండి పాజిటివ్ రెస్పాన్స్తో రన్ అవుతుంది. సినిమాలో కామెడీని ఆడియెన్స్ బాగా ఎంజారు చేస్తున్నారు. థియేటర్స్ పెరిగే అవకాశాలున్నాయి' అని అన్నారు.