Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కార్తీ, జ్యోతిక, నిఖిలా విమల్, సత్యరాజ్ ప్రధాన పాత్రధారులుగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తమిళంలో ఓ సినిమా రూపొందుతుంది. వయాకామ్ 18 స్టూడియోస్ సమర్పణలో ఏ ప్యారలల్ మైండ్స్ ప్రొడక్షన్స్ పతాకంపై సూరజ్ సదన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి తెలుగులో 'దొంగ' అనే టైటిల్ని ఖరారు చేశారు. తాజాగా టైటిల్ని ప్రకటిస్తూ చిత్ర ఫస్ట్లుక్ని కార్తీ సోదరుడు, హీరో సూర్య శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందం చెబుతూ, 'ఎమోషనల్ ఎంటర్టైనర్గా సినిమా రూపొందుతుంది. ఇటీవల కార్తీ 'ఖైదీ'తో సూపర్ హిట్ని అందుకున్నారు. తాజాగా మరో డిఫరెంట్ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాలో నటిస్తున్నారు. దీనికి 'దొంగ'అనే టైటిల్ ఖరారు చేయడం చాలా ఆనందంగా ఉంది. అయితే చిరంజీవి 'ఖైదీ' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత 'దొంగ' పేరుతోనే సినిమా చేశారు. ఇప్పుడు అదే సెంటిమెంట్ని కార్తీ రిపీట్ చేయడం విశేషం. ఇందులో కార్తీ, జ్యోతిక అక్కా తమ్ముడిగా కనిపించనున్నారు. జ్యోతిక సూర్య సతీమణి అనే విషయం విదితమే. రీఎంట్రీ తర్వాత మహిళా ప్రధాన చిత్రాలతో మెప్పిస్తున్న జ్యోతిక ఇందులో మరో ముఖ్య పాత్రలో ఆకట్టుకుంటారు. కార్తీ సరసన ఇందులో నిఖిలా విమల్ నటిస్తున్నారు. వీరి జోడి మెస్మరైజ్ చేస్తుంది. సత్యరాజ్ మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రాన్ని డిసెంబర్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఏడాది కార్తీ ఈ చిత్రంతో మరో హిట్ని తన ఖాతాలో వేసుకోవడం ఖాయం' అని తెలిపింది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఆర్.డి.రాజశేఖర్, సంగీతం: గోవింద్ వసంత.