Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'సింహా', 'లెజెండ్' తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో మూడో సినిమా రాబోతున్న విషయం విదితమే. మిర్యాల రవీందర్రెడ్డి నిర్మించే ఈ చిత్రం డిసెంబర్లో ప్రారంభం కాబోతుందట. జనవరిలో రెగ్యులర్ షూటింగ్ని ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నూతన చిత్రంలో విలన్ పాత్ర కోసం బాలీవుడ్ అగ్ర నటుడు సంజయ్దత్ని ఎంపిక చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉందట. ప్రస్తుతం ఆయన్ని సంప్రదించే పనిలో దర్శక నిర్మాతలున్నారు. మరి సంజయ్ దత్ తెలుగులో నటించేందుకు ఒప్పుకుంటాడా? లేదా అన్నది చూడాలి. ఇదే సెట్ అయితే సంజయ్ దత్ నటించే తొలి తెలుగు చిత్రమవుతుంది. అలాగే ఓ హీరోయిన్ పాత్ర కోసం రచితా రామ్ని తీసుకోబోతున్నారు. ప్రస్తుతం ఆమెతో చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తున్న 'రూలర్' డిసెంబర్లో విడుదల కానుంది. దీనికి కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఆయన రెండు పాత్రల్లో కనువిందు చేయనున్నారు. సంజయ్దత్ ప్రస్తుతం 'టార్బాజ్', 'పానిపట్', 'సడక్ 2','కేజీఎఫ్: ఛాప్టర్ 2', 'భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా' చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.