Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జూనియర్ రవితేజ, శృతి శెట్టి, శ్రావణినిక్కి హీరోహీరోయిన్లుగా సురేష్ తిరుమూర్ దర్శకత్వంలో రాజారెడ్డి మూవీ మేకర్స్ పతాకంపై ఎఫ్ అండ్ ఆర్ సమర్పణలో రాజారెడ్డి కందాల నిర్మిస్తున్న చిత్రం 'లైఫ్ అనుభవించురాజా'. ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ శుక్రవారం జరిగింది. అతిథిగా విచ్చేసిన నిర్మాత రాజ్ కందుకూరి ఈ ట్రైలర్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'ప్రతి ఒక్కరు జీవితంలో ఏదో ఒక టైమ్లో ఎంజారు చేయాలనుకుంటారు. అదే ఈ సినిమా. నిర్మాత అనే వాడు సినిమాకి బ్యాక్బోన్. ఈ చిత్రాన్ని నిర్మించిన రాజారెడ్డిని అభినందిస్తున్నా. ఇది చిన్న సినిమాలు విడుదలయ్యే టైమ్. ఇప్పుడు చిన్న సినిమాలనే ఎక్కువగా ఆదరిస్తున్నారు. రవితేజ చాలా బాగా చేశాడు. హీరోయిన్లు కూడా ఆకట్టుకున్నారు. మ్యూజిక్, కెమెరా, లిరిక్స్ అన్నీ బాగా కుదిరాయి' అని అన్నారు. 'నేను ఒక కథ పట్టుకుని చాలా ఆఫీసులు తిరిగాను. కానీ అవకాశాలు రాలేదు. ఒక రోజు ఈ కథ విని మా బావ నిర్మించేందుకు ముందుకు వచ్చారు. నన్ను సపోర్ట్ చేసిన బావకి ధన్యవాదాలు. ప్రేక్షకులకు బోర్ కొట్టనివ్వకుండా రెండు గంటలు ఎంటర్టైన్ చేసే చిత్రమిది' అని దర్శకుడు తిరుమూరు చెప్పారు. హీరో రవితేజ మాట్లాడుతూ, 'ఆడిషన్ ద్వారా ఈ ఆఫర్ వచ్చింది. ట్రైలర్ అందరికి నచ్చిందనుకుంటున్నా. సినిమా కూడా నచ్చుతుంది' అని చెప్పారు. 'ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు. ఇందులో నటించినందుకు గర్వంగా ఉంది' అని హీరోయిన్లు శ్రావణి నిక్కీ, శృతి శెట్టి తెలిపారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు రామ్, షానీ తదితరులు పాల్గొని చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు.