Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'కెరీర్ ప్రారంభంలోనే గొప్ప నటీనటులు, డైరెక్టర్లు, నిర్మాతలతో కలిపి పనిచేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా' అని అంటోంది దిశాపటానీ. వరుణ్, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన 'లోఫర్', సుశాంత్ సింగ్ రాజ్పుత్, నీరజ్ పాండే కాంబినేషన్లో తెరకెక్కిన 'ఎం.ఎస్.ధోని: ది అన్టోల్డ్ స్టోరీ', జాకీ చాన్, స్టాన్లీ టాగ్ కాంబినేషన్లో విడుదలైన 'కుంగ్ ఫు యోగా', సల్మాన్, అలీ అబ్బాస్ జాఫర్ కలిసి చేసిన 'భారత్', టైగర్ షరాఫ్, అహ్మద్ ఖాన్ కాంబినేషన్లో రూపొందిన 'బాఘి 2' వంటి భారీ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్ని దిశా మెస్మరైజ్ చేసింది. మరోసారి సల్మాన్తో కలిసి 'రాధే'లో నటిస్తోంది. ఈ సందర్భంగా దిశా చెబుతూ, 'సల్మాన్ సర్ గొప్ప వ్యక్తి. ఆయన సెట్కి వస్తున్నారంటే ఓ పవర్ వచ్చిన ఫీలింగ్ ఉంటుంది. కానీ ఆయన చాలా డౌన్ టూ ఎర్త్. ఆయనతో మాట్లాడుతుంటే చాలా బాగుంటుంది. తోటి వారికి సహాయం చేయడంలో ముందుంటారు. తోటి వారిని ప్రేమిస్తారు. ఆయన మనసు బంగారం. నేను కాదు ఎవ్వరైనా సరే ఆయన మంచి మనసుకి ఫిదా అవ్వాల్సిందే' అని సల్మాన్పై ప్రశంసలు కురిపించింది. దిశా ప్రస్తుతం బాలీవుడ్లో 'మళంగ్', 'కేటినా' చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.