Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కార్తీ, నిఖిలా విమల్ జంటగా, జ్యోతిక, సత్యరాజ్ ప్రధాన పాత్రధారులుగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో వయాకామ్ 18 స్టూడియోస్, ప్యారలల్ మైండ్స్ ప్రొడక్షన్ పతాకాలపై సూరజ్ సదానా నిర్మిస్తున్న చిత్రం 'దొంగ'. ఈ చిత్ర తెలుగు టీజర్ను శనివారం హీరో నాగార్జున ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి అభినందనలు తెలపడంతోపాటు కార్తీ మరో బ్లాక్ బస్టర్ని అందుకోబోవడం ఖాయమని అన్నారు. 'నాగార్జున, కార్తీ కలిసి 'ఊపిరి' చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఆ అనుబంధంతో నాగార్జున ఈ చిత్ర టీజర్ని విడుదల చేయడం ఆనందంగా ఉంది. తమిళ టీజర్ను మోహన్లాల్, సూర్య విడుదల చేశారు. ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్గా సినిమా తెరకెక్కుతోంది. కార్తీ క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్గా ఉండబోతోందని టీజర్ చూస్తే అర్థమవుతుంది. ఇందులో రకరకాల పేర్లతో చలామణి అయ్యే దొంగగా పోలీసుల దృష్టిలో కార్తీ కనిపిస్తాడు. ఆడియెన్స్ని థ్రిల్ చేసే యాక్షన్ సీక్వెన్సులు ఉంటూనే అక్కా తమ్ముడి మధ్య కొన్ని ఎమోషనల్ సీన్స్, సెంటిమెంట్ సీన్స్ కూడా కనిపిస్తాయి. ఈ టీజర్ ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా సాగింది. దానికి తగ్గట్టుగానే గోవింద్ వసంత్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇటీవల విడుదలై బ్లాక్బస్టర్ విజయాన్ని అందుకున్న 'ఖైదీ' తర్వాత యాంగ్రీ హీరో కార్తీ చేసిన 'దొంగ' ఫస్ట్లుక్తోనూ, టీజర్తోనూ ఆకట్టుకుంటున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం' అని చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఆర్.డి.రాజశేఖర్, సంగీతం: గోవింద్ వసంత.