Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'మహానటి'తో ఉత్తమ నటిగా జాతీయ అవార్డుని గెలుచుకుని జాతీయ నటిగా మారిపోయారు కీర్తిసురేష్. ఆ సినిమా విజయంతో ఆమె పలు క్రేజీ ప్రాజెక్ట్ల్లో భాగమయ్యారు. వరుసగా మహిళా ప్రధాన చిత్రాల్లో నటిస్తున్నారు. అంతేకాదు బాలీవుడ్లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. అజయ్ దేవగన్ హీరోగా రూపొందుతున్న 'మైదాన్'లో హీరోయిన్గా ఎంపికయ్యారు. అమిత్ శర్మ దర్శకత్వంలో బోనీ కపూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 1952 నేపథ్యంలో ఫుట్బాల్ ఆటగాడు సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతుంది. తాజాగా ఈ సినిమా నుంచి కీర్తి తప్పుకున్నారట. ఇందులోని అజయ్ భార్య పాత్రకి కీర్తి సూట్ కావడం లేదని నిర్మాత బోనీ భావించారట. అదే సమయంలో తన బాలీవుడ్ ఎంట్రీకిది సరైన సినిమా కాదని కీర్తి భావించి ఈ చిత్రం నుంచి తప్పుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం కీర్తి సురేష్ తెలుగులో 'మిస్ ఇండియా', 'రంగ్ దే', 'గుడ్ లక్ సఖీ', తమిళంలో 'పెంగ్విన్', రజనీకాంత్ తాజా చిత్రంలో, ఆది పినిశెట్టితో ఓ సినిమాలో, మలయాళంలో 'మరక్కర్: అరబికడలింటే సింహాం' చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది. ఈ చిత్రాలన్ని ఈ ఏడాదిలో విడుదలకు సిద్ధమవుతున్నాయి. దీంతో బ్యాక్ టూ బ్యాక్ కీర్తి సందడి చేయనున్నారని చెప్పొచ్చు.