Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రవితేజ, నభా నటేష్, పాయల్ రాజ్పుత్, తాన్యా హోప్ హీరోహీరోయిన్లుగా వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో 'డిస్కోరాజా' చిత్రం రూపొందుతుంది. ఎస్.ఆర్.టి పతాకంపై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని 'రమ్ పమ్ బమ్..' అంటూ సాగే పాటని గురువారం విడుదల చేశారు. ఈ పాటని రవితేజ, బప్పిలహరి కలిసి పాడటం విశేషం. ఎస్.ఎస్.తమన్ సంగీతం అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో దర్శకుడు వి.ఐ.ఆనంద్ మాట్లాడుతూ, 'ఈ చిత్రం ఆడియెన్స్ ఓ కొత్త రకమైన అనుభూతినిస్తుంది. రవితేజ క్యారెక్టరైజేషన్ చాలా బాగుంటుంది. తమన్ అందించిన సాంగ్స్ ఈ మధ్య పాపులర్ అయ్యాయి. అలాగే మా సినిమా కోసం మరో సూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చాడు. 'రమ్ పమ్ బమ్' సాంగ్కి మంచి స్పందన లభిస్తుంది. సినిమా కూడా ఆకట్టుకుంటుంది' అని అన్నారు. 'ఈ పాట చేస్తున్నప్పుడు ఛాలెంజింగ్గా తీసుకున్నాను. ఇప్పుడు సాంగ్ను ప్రేక్షకులు బాగా ఎంజారు చేస్తున్నారు. గుడ్ రెస్పాన్స్ లభిస్తోంది. ఈ స్పందన చూస్తుంటే మేం పడ్డ కష్టాన్ని మర్చిపోయాను. సినిమాకు మంచి పాటలు చేసే అవకాశం లభించింది. ఈ చిత్రం నుండి ఇప్పటి వరకు విడుదలైన 'ఢిల్లీవాలా', 'నువ్వు నాతో' పాటలు శ్రోతలను అలరిస్తున్నాయి' అని సంగీత దర్శకుడు ఎస్.ఎస్.తమన్ తెలిపారు. నటుడు సునీల్ చెబుతూ, 'రవితేజగారితో కొంత గ్యాప్ తర్వాత నటిస్తున్న చిత్రమిది. మా ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పిస్తాయి. దర్శకుడు ఆనంద్ డిఫరెంట్ కాన్సెప్ట్తో ఈ సినిమాను తీశాడు. మాస్ రాజా అభిమాను లతోపాటు సాధారణ ప్రేక్షకులకు కూడా ఈ సినిమా ఫుల్ మీల్స్లా ఉంటుంది' అని చెప్పారు. 'రవితేజగారితో వర్క్ చేయడం మర్చిపోలేని అనుభూతి. సినిమాలో నా పాత్ర పేరు నభ. నా పాత్ర మీ అందరికి నచ్చుతుంది. 'ఢిల్లీ వాలా' సాంగ్కి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఈ సాంగ్లో నా డ్యాన్స్ మూమెంట్స్ బాగుంటాయి. జనవరి 24న విడుదల కానున్న ఈ సినిమా మీ అందరిని ఎంటర్టైనర్ చేస్తుంది. సినిమాని పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నా' అని హీరోయిన్ నభా నటేష్ తెలిపారు.