Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రభాస్, పూజా హెగ్డే జంటగా ఓ చిత్రంలో నటిస్తున్నారు. 'జిల్' ఫేమ్ కె.కె.రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ పతాకాలపై ప్రమోద్, వంశీ, కృష్ణంరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్లో శుక్రవారం నుంచి ప్రభాస్ పాల్గొంటున్నారు. ఆ విశేషాలను చిత్ర బృందం వెల్లడించింది. ''బాహుబలి', 'సాహౌ' వంటి సక్సెస్ ఫుల్ చిత్రాల తర్వాత ప్రభాస్ తన తదుపరి చిత్ర షూటింగ్లో పాల్గొంటున్నాడు. తెలుగులో ప్రత్యేక స్థానం ఉన్న గోపీకృష్ణ మూవీస్ని కృష్ణంరాజు స్థాపించిన విషయం విదితమే. తాజా ప్రభాస్ సినిమా ఈ బ్యానర్లో రూపొందుతుండటం విశేషం. భారీ బడ్జెట్తో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ప్యాన్ ఇండియన్ సినిమాగా ఇది తెరకెక్కుతుంది. స్టయిలిష్ యాక్షన్ థ్రిల్లర్గా దర్శకుడు రాధాకృష్ణ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. సినిమా కోసం హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో ఒక ప్రత్యేక సెట్ని వేశాం. ఇందులో ప్రభాస్పై పలు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం' అని చిత్ర బృందం తెలిపింది. ఈ సందర్భంగా సెట్ లోపుల గదిని ప్రభాస్ తిలకిస్తున్నట్టుగా ఉన్న ఫొటోని అభిమానులతో పంచుకున్నారు. ఈ చిత్రానికి మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్గా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్గా, రవీందర్ ఆర్ట్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు.