Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకాలపై అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ సంయుక్తంగా 'అల వైకుంఠపురములో' చిత్రాన్ని రూపొందించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన సినిమా పాజిటివ్ టాక్ని తెచ్చుకుంటోంది. ఈ నేపథ్యంలో త్వరలో గ్రాండ్ సక్సెస్మీట్కి ప్లాన్ చేస్తున్నారు. ఆ విశేషాలను యూనిట్ చెబుతూ, 'సినిమాకి ప్రేక్షకుల నుండి వస్తున్న రెస్పాన్స్ అత్యద్భుతంగా ఉంది. విడుదలైన అన్ని చోట్ల అల్లు అర్జున్ కెరీర్లోనే బెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. గతానికి భిన్నంగా ఓవర్ సీస్లో కూడా ఈ చిత్రం రికార్డు ఓపెనింగ్స్ దక్కించుకోవడం విశేషం. సినిమా ఇంతటి ఘన విజయం సాధించిన సందర్భాన్ని పురస్కరించుకుని అభిమానుల సమక్షంలో చిత్ర విజయోత్సవ సభ నిర్వహించబోతున్నాం. ఈ నెల 19న వైజాగ్లో ఈ సక్సెస్ సెల్రబ్రేషన్ గ్రాండ్గా చేయబోతున్నాం' అని తెలిపింది. టబు, సుశాంత్, నివేదా పేతురాజ్, నవదీప్, జయరామ్, రాజేంద్రప్రసాద్, మురళీశర్మ, సునీల్, సముద్రఖని ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాకి తమన్ సంగీతం సమకూర్చారు.