Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజ్తరుణ్, మాళవిక నాయర్ జంటగా కొండా విజరు కుమార్ దర్శకత్వంలో
'ఒరేరు బుజ్జిగా' చిత్రం రూపొందుతుంది. శ్రీమతి లక్ష్మీ రాధామోహన్
సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి నిర్మాత కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ, 'మా చిత్ర షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాజ్ తరుణ్ ఎనర్జీకి తగిన యూత్ఫుల్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా డిఫరెంట్ స్టోరీతో దర్శకులు కొండా విజరుకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సమ్మర్ స్పెషల్గా ఏప్రిల్ 3న సినిమాని విడుదల చేయనున్నాం. ఈ చిత్రం కచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. మా బ్యానర్లో మరో సూపర్ హిట్ చిత్రమవుతుంది' అని అన్నారు. హేబా పటేల్ కీలక పాత్రధారిణిగా, వాణీ విశ్వనాథ్, నరేష్, పోసాని, అనీష్ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజరు ఘోష్, అన్నపూర్ణ, సిరి, జయలక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్ ఇతర పాత్రలు పోషిస్తున్న
ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, ఫొటోగ్రఫీ: ఐ.ఆండ్రూ, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి.