Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహేష్బాబు, రష్మిక మందన్నా జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్రాజు సమర్పణలో, అనిల్ సుంకర 'సరిలేరు నీకెవ్వరు' చిత్రాన్ని నిర్మించారు. సంక్రాంతి కానుకగా విడుదలై పాజిటివ్ టాక్తో రన్ అవుతున్న ఈ చిత్రంలో మరికొన్ని సన్నివేశాలను యాడ్ చేస్తున్నారు. ఆ విశేషాలను దర్శకుడు అనిల్ రావిపూడి చెబుతూ, 'మా చిత్రాన్ని అపూర్వంగా ఆదరిస్తూ మహేష్ బాబు కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్గా నిలిపిన ప్రేక్షకులకు, సూపర్స్టార్ కృష్ణ, మహేష్బాబు అభిమానులకు కృతజ్ఞతలు. మా చిత్రాన్ని చూసి అన్ని వర్గాల ప్రేక్షకులు ఎంతో ఎంజారు చేస్తున్నారు. అయితే ఈ ఎంటర్టైన్మెంట్ని ఇంకా ఎక్కువ చేయాలని మహేష్బాబు, రావురమేష్ ఫ్యామిలీ మెంబర్స్ మధ్య వచ్చే ఒక మంచి హిలేరియస్ సన్నివేశాన్ని నేటి(శనివారం) ఉదయం షో నుంచి అన్ని సెంటర్లలో యాడ్ చేస్తున్నాం. అందుకు చాలా సంతోషంగా ఉంది. పూర్తి వినోదాత్మకంగా రూపొందించిన ఈ చిత్రం విజయవంతంగా దూసుకుపోతుంది' అని అన్నారు.