Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''లైఫ్ అనుభవించు రాజా' చిత్రాన్ని సీనియర్ ఎన్టీఆర్కి అంకితమిస్తున్నా' అని దర్శకుడు సురేష్ తిరుమూర్ అన్నారు. రవితేజ, శ్రావణి నిక్కీ, శృతి శెట్టి హీరోహీరోయిన్లుగా సురేష్ తిరుమూర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'లైఫ్ అనుభవించు రాజా'. నేడు (శుక్రవారం) సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం దర్శకుడు మీడియాతో మాట్లాడుతూ, 'మనం నిత్యం ఎన్నో అనుకుంటాం. కానీ చాలా సందర్భాల్లో అనుకున్నవి కావు. ఫెయిల్యూర్సే ఎక్కువగా ఉంటాయి. మంచైనా, చెడైనా, సక్సెస్ అయినా, ఫెయిల్యూర్ అయినా, ఏది జరిగినా ప్రతి మూవ్మెంట్ని అనుభవించాలని చెప్పే చిత్రమిది. జీవితంలో కోటీశ్వరుడు అవ్వాలనుకున్న హీరో అందుకు ఎదురైన ఇబ్బందులను, తన ప్రేమ విషయాన్ని ఎలా ఫేస్ చేశాడనే కథాంశంతో సాగే చిత్రమిది. నేను దర్శకుడిని కావడానికి ముందు కొన్ని వ్యాపారాలు చేశాను. ఆ అనుభవాలు కూడా ఇందులో మేళవించాను. సమకాలీన అంశాలను జోడించి ట్రెండీగా రూపొందించా. యూత్ని టార్గెట్గా చేసుకుని రూపొందించాం. రవితేజ కొత్త నటుడైనా చాలా బాగా నటించాడు. కథానాయికలు తమ అందాలతో మంత్రముగ్ధుల్ని చేస్తారు. శుక్రవారం ఓ పెద్ద సినిమా కూడా విడుదలవుతుంది. ఆ చిత్రానికి వచ్చిన ఓవర్ ఫ్లో మా సినిమాకి హెల్ప్ అవుతుందని భావించి ప్రేమికుల రోజునే విడుదల చేస్తున్నాం. లక్కీగా మంచి థియేటర్లు దొరికాయి. ఇటీవల సినిమా ప్రివ్యూని వేశాను. అందరి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. విడుదలయ్యాక మంచి ఆఫర్స్ వస్తాయని నమ్ముతున్నా. 'లైఫ్ అనుభవించు రాజా' అనే టైటిల్ ఎన్టీఆర్ నటించిన 'మనుషులంతా ఒక్కటే' చిత్రంలోని పాట నుంచి తీసుకున్నాం. అందుకే ఈ చిత్రాన్ని ఎన్టీఆర్కి అంకితమిస్తున్నా' అని చెప్పారు.