Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అభిరామ్ వర్మ, కృతి గార్గ్ జంటగా సుబ్బు వేదుల దర్శకత్వంలో 'రాహు' చిత్రం రూపొందుతుంది. ఏ.వి.ఆర్ స్వామీ, శ్రీ శక్తి బాబ్జి, రాజా దేవరకొండ, సుబ్బు వేదుల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి సిధ్ శ్రీరామ్ పాడిన 'ఎన్నెన్నో వర్ణాలు వాలాయి చుట్టూ..' అంటూ సాగే పాట ఇటీవల విడుదలైంది. దీనికి మంచి స్పందన లభిస్తుంది. ఈ సందర్భంగా దర్శకుడు సుబ్బు వేదుల మాట్లాడుతూ, 'న్యూ ఏజ్ థ్రిల్లర్ చిత్రమిది. తన గాత్రం తెలుగు ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తున్న సిధ్ శ్రీరామ్ పాడిన ''ఎన్నెన్నో వర్ణాలు వాలాయి చుట్టూ నీతోటి నే సాగగా.. పాదాలూ దూరాలు మరిచాయి ఒట్టూ మేఘాల్లో ఉన్నట్టుగా.. ఏమో ఏమో ఏమో'' పాట సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిత్ర శాటిలైట్, డిజిటిల్ హాక్కులు జి తెలుగు సొంతం చేసుకోవడం ఈ సినిమాపై మరింత అంచనాలను పెంచింది. టెక్నికల్గా హై స్టాండర్డ్స్లో ఉండబోతుంది. ప్రవీణ్ లక్కరాజు అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి అసెట్గా మారింది. కృతి గార్గ్, అభిరామ్ వర్మల నటనకు ప్రత్యేక ప్రశంసలు దక్కుతాయి. థ్రిలర్స్ తెలుగులో కొత్త ట్రెండ్ని సెట్ చేస్తున్నాయి. ఇది వాటి సరసన నిలబడుతుంది ఈ నెల 28న సినిమాని సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా గ్రాండ్గా విడుదల చేస్తున్నాం' అని అన్నారు.