Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాగ శౌర్య , రీతువర్మ జంటగా లక్ష్మీ సౌజన్యని దర్శకురాలిగా పరిచయం చేస్తూ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్య దేవర నాగవంశీ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది గురువారం ఫిల్మ్ నగర్లోని సంస్థ కార్యాలయంలో ప్రారంభమైంది. 'ఇటీవల 'అశ్వథ్థామ'తో మంచి విజయాన్ని అందుకున్న నాగశౌర్య హీరోగా, నూతన దర్శకురాలు లక్ష్మీ సౌజన్యని దర్శకురాలిగా పరిచయం చేస్తూ ఈ విభిన్న కథా చిత్రాన్ని రూపొందించడం చాలా ఆనందంగా ఉంది. ఈ నెల 19 నుంచి చిత్ర రెగ్యులర్ షూటింగ్ని ప్రారంభిస్తాం. సినిమాకి సంబంధించి ఇతర నటీ, నట సాంకేతిక వర్గం వివరాలు మరి కొద్దిరోజులలో ప్రకటిస్తాం. ఇది మా బ్యానర్లో మరో విజయవంతమైన సినిమా అవుతుందని నమ్ముతున్నాం' అని నిర్మాత సూర్య దేవర నాగవంశీ వెల్లడించారు.
ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: వంశీ పచ్చిపులుసు, సంగీతం: విశాల్ చంద్రశేఖర్, ఎడిటర్: నవీన్ నూలి, ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, సమర్పణ: పి.డి.వి.ప్రసాద్.