Authorization
Mon Jan 19, 2015 06:51 pm
, లావణ్య త్రిపాఠి జంటగా కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పతాకంపై బన్ని వాసు 'చావు కబురు చల్లగా' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం గురువారం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి అల్లు అరవింద్ మనవరాలు బేబి అన్విత క్లాప్ నివ్వగా, అల్లు అర్జున్ కుమారుడు అల్లు ఆయాన్ కెమెరా స్విచాన్ చేశారు. అల్లు అరవింద్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా యూనిట్ చెబుతూ, ''ఆర్.ఎక్స్ 100' సినిమాతో నటుడిగా మంచి క్రేజ్ తెచ్చుకున్న కార్తికేయ హీరోగా, లావణ్య త్రిపాఠి హీరోయిన్గా కౌశిక్ పెగళ్లపాటిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఈ చిత్రాన్ని నిర్మించడం చాలా హ్యాపీగా ఉంది. ఈ చిత్రంలో హీరో కార్తికేయ బస్తి బాలరాజు పాత్రలో కనిపించబోతున్నాడు. ఈనెల 19 నుంచి రెగ్యులర్ షూటింగ్ని జరుపనున్నాం. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తాం' అని తెలిపింది. ఆమని, శ్రీకాంత్ అయ్యంగర్, మహేష్, భద్రం ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి జేక్స్ బిజోరు సంగీతాన్ని అందిస్తున్నారు. సునీల్ రెడ్డి సినిమాటోగ్రాఫర్గా పనిచేస్తున్నారు. సత్య ఎడిటర్గా, మనీషా ఏ దత్ ప్రొడక్షన్ డిజైనర్గా పని చేస్తున్నారు.