Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నా సినిమాలకి బజ్ రావడానికి కారణం అభిమానులు. మీలాంటి రౌడీస్ వల్ల, తెలుగు సినిమా ఆడియెన్స్ వల్ల ఈ బజ్ క్రియేట్ అవుతోంది. నేను మీకిచ్చేది ఒకే ఒక గ్యారంటే. మీరు నా ఏ సినిమాకి వెళ్లినా ఒక కొత్త ఎక్స్ పీరియెన్స్ ఉంటుంది. ఈ సినిమాలోనూ మీకొక కొత్త ఎక్స్ పీరియెన్స్ గ్యారంటీగా ఉంటుంది' అని విజరు దేవరకొండ అన్నారు. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజరు దేవరకొండ, రాశీఖన్నా, ఐశ్వర్యా రాజేష్, కేథరిన్ థ్రెస్సా, ఇజాబెల్లా లెయితే హీరోహీరోయిన్లుగా కె.ఎస్.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ నిర్మించిన చిత్రం 'వరల్డ్ ఫేమస్ లవర్'. నేడు(శుక్రవారం) సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం వైజాగ్లో చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'మీరందరూ(ఫ్యాన్స్) నేనెక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నారు. థియేటర్లు నింపుతున్నారు. ఇంతమందిని చూస్తే అందరినీ గట్టిగా కౌగిలించుకోవాలని ఉంటుంది. ఇది నా ఆఖరి లవ్ స్టోరీ. దీని గురించి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ముంబయిలో షూటింగ్లో ఉండటం వల్ల ప్రమోషన్ చేయలేకపోయాను. ఈ నెల 6న ట్రైలర్ లాంచ్ చేసినప్పుడే చెప్పా, 'విజరు దేవరకొండ సినిమా అంటే ఒక బజ్, ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది. అది ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది' అని. వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ అభిషేక్ వచ్చి 'హైదరాబాద్లో బుకింగ్స్ ఫుల్ అవుతున్నారు' అని చెప్పాడు. 'అట్లా ఎట్లా అవుతారు, ఇంకా ప్రమోషనే స్టార్ట్ చేయలేదు' అని నేనడిగాను. దానికి కారణం అభిమానులే. ఈ సినిమా మీకొక కొత్త ఎక్స్ పీరియెన్స్నిస్తుంది. ఒక చిన్న పల్లెటూరిలో జరిగే ప్రేమకథ, ప్యారిస్లో జరిగే ఒక ప్రేమకథ, హైదారాబాద్, వైజాగ్ లాంటి సిటీల్లో జరిగే ఓ ప్రేమకథ. ఇలా ఈ ప్రేమికుల రోజున నాలుగు ప్రేమకథలు నింపి ఈ సినిమా తీసుకొస్తున్నాం. రిజల్ట్ ఏమవుతుందో తెలియదు. మీరే చెప్పాలి. కానీ మా నటన అదరిపోతుంది. ఈ వాలెంటైన్స్ డేకి మీ అందరికీ స్వాగతం. థియేటర్స్కి రండి. ప్రేమలో పడండి. ఈ చిత్రంతో ప్రేమను ఎక్స్ పీరియెన్స్ చేయండి. మీరందరూ నా లైఫ్లో ఉండటం ఒక గిఫ్ట్' అని అన్నారు.
'వైజాగ్లో నిత్యా మీనన్, శర్వానంద్లతో 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' అనే సినిమా తీశా. మీరంతా మీ విశాఖపట్నంలో ఎగిసిపడే ఒక అలలా ఉన్నారు. సముద్ర తీరం దగ్గర ఉన్నవాళ్లంతా చాలా ప్రేమగల వాళ్లయి ఉంటారు. మిమ్మల్ని అందర్నీ ఎంటర్టైన్ చేయడానికి విజరు దేవరకొండ నలుగురు అమ్మాయిలతో చాలా కష్టపడి చేశాడు. ప్రేమికుల రోజున మీరంతా థియేటర్కు వచ్చి ఎంజారు చేయండి' అని దర్శకుడు క్రాంతి మాధవ్ తెలిపారు. రాశీ ఖన్నా మాట్లాడుతూ, ''నేనిప్పటి దాకా ఇంత ఎగ్జైట్ అయ్యే ఆడియెన్స్ని చూడలేదు. విజరు నుంచి అనూహ్యమైంది ఎక్స్పెక్ట్ చేస్తాం. ఈ సినిమాలో అది ఉంటుంది. ఈ రోజు కూడా అతని బట్టలు చూసి ఆశ్చర్యపోయాను. విజరు ఈ సినిమాలో చాలా బాగా చేశాడు. ప్రేమలో పడే ముందు చాలా మంది చాలా ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకుంటారు. ప్రేమలో పడిన తర్వాత ఈ ఎక్స్ పెక్టేషన్స్ మారుతున్నారు. రియాలిటీతో చూస్తే ప్రేమ అనేది డిఫరెంట్గా కనిపిస్తుంది. ఈ సినిమా రియాలిటీకి చాలా దగ్గరగా ఉంటుంది. మీరు యామిని పాత్రను ఎంతో ప్రేమించినందుకు చాలా థాంక్స్. యామిని, గౌతమ్ లవ్ స్టోరీ కచ్చితంగా నచ్చుతుంది' అని తెలిపారు.