Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాయిబాబు, ఆశీరాం, సురయ పర్విన్ హీరోహీరో యిన్లుగా సీనియర్ ఎడిటర్ వెంకట్రామ్ పల్లా దర్శకత్వంలో అనిషా క్రియేషన్స్ పతాకంపై ఓ.సుగుణ నిర్మిస్తున్న చిత్రం 'నీకై అభిసారికనై'. శర వేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రం గురించి నిర్మాత సుగుణ చెబుతూ, 'ఇది ఇప్పటికే మొదటి షెడ్యూల్ని పూర్తి చేసుకుంది. ఈ నెల 10 నుంచి రెండో షెడ్యూల్ని ప్రారంభించాం. ఈ నెలాఖరుతో చిత్రీకరణ మొత్తం పూర్తవుతుంది' అని అన్నారు. 'ప్రస్తుతం ఫైట్ మాస్టర్ రాబిన్ సుబ్బు నేతృత్వంలో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం. లవ్ హర్రర్ ప్రధానంగా యూత్ని ఆకర్షించే విధంగా ఈ చిత్రం ఉంటుంది. చిత్ర రంగంలో దాదాపు రెండు దశాబ్దాలకుపైగా ఎడిటర్గా ఎంతో అనుభవమున్న నన్ను నమ్మి దర్శకత్వ అవకాశం ఇచ్చిన నిర్మాత సుగుణకి ప్రత్యేక ధన్యవాదాలు. 'నీకై అభిసారికనై' టైటిల్లో మంచి ఫీల్ గుడ్ కనిపిస్తుందని చిత్ర యూనిట్ ప్రశంసించారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకుని అతి త్వరలో సినిమా విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం' అని దర్శకులు వెంకట్రావ్ పల్లా తెలిపారు. నెహ్రు బాబు, రఘు బాబు, మచ్చా నాగభూషణ్, బాలాజీ, ధరణి, శ్రీనివాస రాజు, జబర్దస్త్ రాజమౌళి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ప్రసాద్, సంగీతం : రాజ్ కిరణ్.