Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నలుగురు కుర్రాళ్ల మధ్య ప్రస్తుతం జరిగే పరిణామాల నేపథ్యంలో రూపొందిస్తున్న చిత్రం 'పంక్చర్'' అని దర్శకుడు శ్రీరంగం శేష శ్రీ అన్నారు. హరీష్, వినోద్, కార్తీక్, వెంకట చరణ్ హీరోలుగా, గీతషా, సంజన, లాస్య శ్రీ కథానాయికలుగా 'పంక్చర్' చిత్రం రూపొందు తుంది. చంద్రుడు క్రియేషన్స్ సమర్పణలో శ్రీ లక్ష్మి ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీరంగం శేష శ్రీ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తు న్నారు. శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో దర్శక నిర్మాత శ్రీరంగం శేషశ్రీ మాట్లాడుతూ, 'ఇది నా మొదటి సినిమా. అనుభవజ్ఞులైన సంగీత దర్శకుడు అర్జున్, అలాగే సాయినాథ్ మా సినిమాకు సహకరించినందుకు ధన్యవాదాలు. చక్కటి కథతో హాస్యంతో నిండుకున్న చిత్రమిది. ఈ సినిమాకు సంబంధించి ఓ కాంటెస్ట్ నిర్వహిస్తున్నాం. సినిమా టైటిల్ని బట్టి కథ ఎలా ఉంటుందో ఊహించి రాసిన వారికి భారీ ప్రైజ్ మనీ ఇస్తాం. సినిమా స్టోరీని పోలి ఉన్న కథలను రాసివారిని లక్కీ డ్రా తీసి విజేతగా ఎంపిక చేసి, పది లక్షల విలువ చేసే ఓపెన్ ప్లాట్ గిఫ్ట్గా ఇస్తాం' అని అన్నారు. 'మంచి సబ్జెక్ట్తో వస్తున్న ఈ సినిమా సమాజానికి ఉపయోగపడే విధంగా నిలుస్తుంది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుగుతుంది' అని సమర్పకులు రాజు రాళ్ళబండి తెలిపారు. రచయిత సాయినాథ్ మాట్లాడుతూ, 'ఇది స్క్రీన్ప్లే బేస్డ్ సినిమా. ప్రస్తుతం వినోదాత్మకమైన చిత్రాలనే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇది అలాంటిదే. వినోదంతోపాటు ఆలోచించజేసే విధంగా ఉంటుంది' అని చెప్పారు. మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ మాట్లాడుతూ, ''పంక్చర్' ఇదొక వెరైటీ టైటిల్. అయినా సబ్జెక్ట్ చాలా బాగుంది. సినిమాలో నాలుగు పాటలు ఉన్నాయి. చిన్న సినిమాలను ప్రొత్సహించాలని కోరుతున్నా' అని తెలిపారు.