Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'మత్స్యకారుల జీవన విధానాల్ని, వారి కట్టు బాట్లని, వారి కష్టాలకు పరిష్కారం తెలియచెప్పే కథాంశంతో 'జెట్టి' చిత్రాన్ని రూపొందిస్తు న్నాం' అని దర్శకుడు సుబ్రమణ్యం పిచ్చుక అన్నారు. అజయ్ ఘోష్, మన్యం కృష్ణ, మైమ్ గోపీ ప్రధాన పాత్రధారులుగా సుబ్రమణ్యం ని దర్శకుడిగా పరిచయం చేస్తూ వర్ధిన్ ప్రొడక్షన్స్ పతాకంపై కునపరెడ్డి వేణు మాధవ్, పండ్రాజు వెంకట రామారావు నిర్మిస్తున్న చిత్రం 'జెట్టి'. ఇది ప్రకాశం జిల్లాలో ప్రారంభమైంది. వైసీపీ నేతలు ఆమంచి కృష్ణమోహన్, మోపిదేవి వెంకటరమణ, మోపిదేవి హరిబాబులు పాల్గొన్నారు. దర్శకుడు మాట్లాడుతూ, 'ప్రపంచం అంతా సాంకేతికంగా పరుగులు పెడుతున్నా, అనాదిగా వస్తున్న ఆచారాలని నమ్ముకుంటూ, వాటి విలువల్ని పాటిస్తూ, సముద్రపు ఒడ్డున ఆవాసాలు ఏర్పాటు చేసుకుని, సముద్రపు అలలపైన జీవిత పయనం సాగించే మత్స్యకార గ్రామాలు చాలా ఉన్నాయి. అలాంటి ఒక గ్రామంలో జరిగిన కథ ఇది. తెలుగు తెరపై ఈ నేపథ్యం కథలు ఇప్పటి వరకూ రాలేదు. పూర్తిగా మత్య్సకారుల జీవితాలను ఇందులో ఆవిష్కరిస్తాం. తెలుగు సినిమా నేటివిటీ ఉన్న కథలవైపు ప్రయాణం చేస్తున్న టైంలో 'జెట్టి' తెలుగు తెరకు కొత్త కథగా మారుతుంది. దర్శకుడిగా నా తొలి ప్రయత్నంకి అండగా నిలిచిన నా నిర్మాతలకు కృతజ్ఞతలు' అని అన్నారు.