Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాగశౌర్య హీరోగా, రాజాని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మాత మహేష్ కోనేరు ఓ కొత్త చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాని ప్రేమికుల రోజుని పురస్కరించుకుని శుక్రవారం ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్మాత మహేష్ కోనేరు మాట్లాడుతూ, 'మా బ్యానర్లో '118' వంటి హిట్ తర్వాత ప్రస్తుతం 'మహానటి'తో ఉత్తమ నటిగా జాతీయ అవార్డుని అందుకున్న కీర్తి సురేష్ ప్రధాన పాత్రధారిణిగా 'మిస్ ఇండియా' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. తాజాగా ప్రొడక్షన్ నెం. 4గా నాగశౌర్య సినిమాని రూపొందించనున్నాం. పలు విజయవంతమైన చిత్రాలకు రచయితగా పనిచేసిన రాజాని ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం. వేసవి ప్రారంభంలో సినిమా షూటింగ్ని ప్రారంభిస్తాం. ఇందులో నటించే నటీనటులు, పనిచేసే సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటిస్తాం' అని అన్నారు.