Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాగచైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఏమిగోస్ క్రియేషన్స్, సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి పతాకాలపై నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు నిర్మిస్తున్న చిత్రం 'లవ్ స్టోరి'. ప్రేమికుల రోజుని పురస్కరించుకుని ఈ చిత్రంలోని 'ఏయ్ పిల్లా' అంటూ సాగే పాట మ్యూజికల్ ప్రివ్యూని విడుదల చేశారు. దీనికి మంచి స్పందన లభిస్తున్న నేపథ్యంలో యూనిట్ చెబుతూ, 'ఈ పాటలో 'ఏం దబ్బా.. ముద్దు పెడితే ఏడుస్తారబ్బా' సాయి పల్లవి డైలాగ్ ఈ వాలంటైన్స్ డేకి మెమరబుల్గా మిగులుతుంది. సెన్సిబుల్ లవ్ స్టోరీస్ని బలంగా ప్రజెంట్ చేయడంలో మాస్టర్ అయిన శేఖర్ కమ్ముల తెరమీద కురిపించబోతున్న ఈ ప్రేమలో తడిచేందుకు ప్రేక్షకుల్ని ప్రిపేర్ చేసింది ఈ సాంగ్. రెహామాన్ వద్ద పనిచేసిన పవన్ స్వరాలు ఈ ప్రేమకథను మరింత హృద్యంగా మార్చబోతున్నాయి. 'ఫిదా' తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రాబోతున్న ఈ అందమైన ప్రేమకథ అక్కినేని అభిమానుల్లో, ప్రేక్షకుల్లో అమితాసక్తిని కలిగించింది. ఈ ప్రేమకథ సమ్మర్ కి స్సెషల్ ఎట్రాక్షన్గా మారబోతుంది. ప్రస్తుతం చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని సమ్మర్లో విడుదలకు ప్లాన్ చేస్తున్నాం' అని తెలిపింది. రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: విజయ్ సి.కుమార్, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, ఆర్ట్: రాజీవ్ నాయర్. సంగీతం: పవన్ సి.హెచ్.