Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజీవ్ సిద్ధార్థ్, భవాని చౌదరి, శాను మజ్జారి హీరోహీరోయిన్లుగా మురళి దర్శకత్వంలో శ్రీరామ్ క్రియేషన్స్, వీఎం స్టూడియోస్ పతాకాలపై హరి కుమార్ నిర్మిస్తున్న చిత్రం 'ఏమైపోయావే'. ప్రేమికుల రోజుని పురస్కరించుకుని ఈ చిత్ర మోషన్ పోస్టర్ని నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'టైటిల్ చాలా క్యాచీగా ఉంది. మోషన్ పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. తప్పకుండా సినిమా ఘన విజయం సాధించి చిత్ర యూనిట్కి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా' అని అన్నారు. 'ఇదొక మంచి ఫీల్ గుడ్ ఎంటర్టైనర్. మేము అడిగిన వెంటనే మా చిత్ర మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన నిర్మాత రాజ్ కందుకూరికి ప్రత్యేక ధన్యవాదాలు. సినిమా బాగా రావడానికి ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఎంతగానో సపోర్ట్ చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమా విడుదల తేదీ ప్రకటిస్తాం' అని నిర్మాత హరికుమార్ తెలిపారు. శ్రీను కేసబోయిన, మిర్చి మాధవి, సునీత మనోహర్, నామాల మూర్తి, మీసం సురేష్, మళ్ళీ రావా బుజ్జి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: శివ రాథోడ్, సంగీతం: రామ్ చరణ్.