Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దుల్కర్ సల్మాన్, రీతూ వర్మ జంటగా దేసింగ్ పెరియసామి దర్శకత్వంలో మలయాళంలో 'కణ్ణుమ్ కణ్ణుమ్ కుళ్లయడిత్తా' చిత్రం రూపొందుతుంది. వయోకామ్ 18 స్టూడియోస్, ఆంటో జోసెఫ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్ర తెలుగు అనువాద హక్కులను కె.ఎఫ్.సి. ఎంటర్టైన్మెంట్స్ సంస్థ దక్కించుకుంది. దీన్ని 'కనులు కనులను దోచాయంటే' పేరుతో తెలుగులో విడుదల చేయనున్నారు.
ఈ సందర్భంగా చిత్రం బృందం చెబుతూ, 'కనులు కనులను దోచాయంటే ప్రేమ అని దాని అర్థం'. మణిరత్నం దర్శకత్వం వహించిన 'దొంగ దొంగ'లో హిట్ సాంగ్ ఇది. ఇప్పుడీ పాటలోని తొలి మూడు పదాలే టైటిల్గా తాజా చిత్రానికి పెట్టాం. రొమాంటిక్ థ్రిల్లర్గా ఈ చిత్రం రూపొందింది. దుల్కర్ సల్మాన్ నటించిన 25వ చిత్రమిది. ఇందులోని 'గుండెగిల్లి ప్రాణం తియ్యొద్దే' పాటను శనివారం విడుదల చేశారు. మసాలా కాఫీ సంగీతం అందించిన ఈ బాణీకి సామ్రాట్ నాయుడు, పూర్ణాచారి సాహిత్యం అందించారు. పాటకి మంచి ఆదరణ లభిస్తుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ నెల 28న విడుదల చేస్తున్నాం' అని తెలిపింది. దర్శకుడు దేసింగ్ పెరియసామి మాట్లాడుతూ, 'మొబైల్ అప్లికేషన్ డెవలపర్ సిద్ధార్థ్ క్యారెక్టర్లో దుల్కర్ సల్మాన్ నటించారు. అతడికి కల్లీస్ అని స్నేహితుడు ఉంటాడు. మీరా పాత్రలో హీరోయిన్ రీతూ వర్మ నటించారు. ఆమెకు శ్రేయ అని స్నేహితురాలు ఉంటుంది. మీరాతో సిద్ధార్థ్, శ్రేయతో కల్లీస్ ప్రేమలో పడతారు. లగ్జరీ లైఫ్ స్టైల్కు అలవాటు పడిన సిద్ధార్థ్, కల్లీస్ ఏం చేశారు? వాళ్లు చేసిన పనుల వల్ల ఎలాంటి సమస్యల్లో చిక్కుకున్నారు? అనేది చిత్రకథ. ఆద్యంతం ట్విస్టులతో సాగుతుంది' అని అన్నారు.