Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హీరో నితిన్ బ్యాచ్లర్ లైఫ్కి బారు చెప్పేందుకు రెడీగా ఉన్నారు. గత నాలుగేండ్లుగా ప్రేమలో ఉన్న నితిన్, శాలిని పెళ్ళికి ఇరు కుటుంబ సభ్యులు గ్రీన్సిగల్ ఇచ్చారు. దీంతో వీళ్ళ పెళ్ళికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం హైదరాబాద్లోని నితిన్ ఇంట్లో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో 'పసుపు కుంకుమ' కార్యక్రమం జరిగింది.ఈ విషయాన్ని నితిన్ ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తూ ఫొటోలను షేర్ చేశారు. ''పెళ్లిపనులు మొదలయ్యాయి. మ్యూజిక్ మొదలయ్యింది. మీ ఆశీర్వాదం కావాలి'' అని పోస్ట్ చేశాడు. ఏప్రిల్ 15న నిశ్చితార్థం, 16న పెళ్లి జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఏప్రిల్ 16న దుబారులో వీళ్ళ డెస్టినేషన్ వెడ్డింగ్ జరుగనుంది. ఆ తర్వాత హైదరాబాద్లో రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. ఇదిలా ఉంటే, నితిన్ హీరోగా నటిస్తున్న తాజాగా చిత్రం 'భీష్మ' ఈ నెల 21న విడుదల కానుంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా కథానాయికగా నటించింది. దీంతోపాటు 'రంగ్దే' చిత్రంలోనూ నితిన్ నటిస్తున్నారు.