Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హీరో రాజశేఖర్ ద్విపాత్రాభినయం చేసిన చిత్రం 'అర్జున'. కన్మణి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో మరియం జకారియా కథానాయికగా నటించింది. నట్టిస్ ఎంటర్టైన్మెంట్స్, క్విటీ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై నట్టి కరుణ, నట్టి క్రాంతి నిర్మిస్తున్నారు. విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం గురించి నిర్మాతలు మాట్లాడుతూ, 'ఇందులో తండ్రీ కొడుకులుగా రాజశేఖర్ తన పాత్రలలో నట విశ్వరూపం చూపించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు అద్దంపట్టే చిత్రమిది. కాస్త వయసు మళ్ళిన సూర్యనారాయణ అనే రైతు పాత్రలోనూ, ఆయన తనయుడిగా అర్జున పాత్రలోనూ రాజశేఖర్ ఒదిగిపోయిన విధానం ప్రేక్షకులను ఎంతగానో అలరింపచేస్తుంది. తండ్రీకొడుకుల మధ్యన వచ్చే భావోద్వేగ సన్నివేశాలు సినిమాకు మరో హైలైట్గా, హృదయానికి హత్తుకునేలా ఉంటాయి. మిగతా పాత్రలకు యాప్ట్గా నిలిచే తారాగణం కుదిరింది. యదార్థ సంఘటనలను ప్రేరణగా తీసుకుని సహజత్వానికి దగ్గరగా దర్శకుడు కన్మణి ఈ చిత్రాన్ని మలిచారు. త్వరలోనే ట్రైలర్ని విడుదల చేసి, చిత్ర విడుదల తేదీని ప్రకటిస్తాం' అని అన్నారు. కోట శ్రీనివాసరావు, చలపతిరావు, రేఖ, మురళీశర్మ, సుప్రీత్, కాదంబరి కిరణ్, శివాజీరాజా తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఎ.విజయకుమార్, సంగీతం: వందేమాతరం శ్రీనివాస్, ఎడిటింగ్: గౌతంరాజు.