Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆర్మీ నేపథ్యంలో రూపొందిన 'ఉరి', 'వార్', 'బాట్లాహౌస్' వంటి తదితర చిత్రాలు బాలీవుడ్లో ఘన విజయాలను అందుకున్నాయి. అలాగే త్వరలో మరికొన్ని ఆర్మీ నేపథ్య చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
వీటిల్లో మహిళా ప్రధానంగా సాగే చిత్రాలూ ఉండటం విశేషం. ఇప్పటికే జాహ్వనీ కపూర్ ఫైలట్ గుంజన్ సక్సేనా జీవితం ఆధారంగా రూపొందుతున్న 'గుంజన్ సక్సేనా'చిత్రంలో నటిస్తుండగా, తాజాగా కంగనా రనౌత్ కూడా
ఎయిర్ఫోర్స్ పైలట్గా మారటం మరో విశేషం. ఎయిర్ఫోర్స్ పైలట్ కథాంశంతో 'తేజస్' పేరుతో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్నారు.
సర్వేష్ మేవర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్లుక్ని సోమవారం చిత్ర బృందం సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.
పైలట్ డ్రెస్లో శక్తివంతమైన ఆహార్యంతో స్టయిల్గా నడుచుకుంటూ వస్తున్న కంగనా లుక్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్లో విడుదల చేయనున్నారు. కంగనా దీంతోపాటు తమిళనాడు మాజీ సీఎం, అలనాటి నటి జయలలిత జీవితం ఆధారంగా రూపొందే 'తలైవి' చిత్రంలో జయలలితగా నటిస్తున్నారు. అలాగే మరో యాక్షన్ ఎంటర్టైనర్ 'ధాఖడ్'లోనూ
పవర్ఫుల్ రోల్ పోషిస్తున్నారు.