Authorization
Mon Jan 19, 2015 06:51 pm
క్రిష్, అష్మిత, త్రిష హీరో హీరోయిన్లుగా మురళి శర్మ, దేవ్గిల్ పాత్రధారులుగా బి.ఎన్.ఎస్.రాజు దర్శకత్వంలో క్రిష్ సమర్పణలో కె.సిరీస్ మూవీ ఫ్యాక్టరీ పతాకంపై క్రిష్ నిర్మిస్తున్న చిత్రం 'రావణలంక'. ఈ చిత్రానికి టైటిల్ని ఖరారు చేసి, తాజాగా ఫస్ట్లుక్, మోషన్ పోస్టర్ని విడుదల చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు బి.ఎన్.ఎస్. రాజు మాట్లాడుతూ, 'చాలా రోజుల తర్వాత తెలుగు సినిమా ఇండిస్టీకి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్గా మా చిత్రం రానుందని గర్వంగా చెప్తున్నాను. ఇలాంటి చిత్రాలకి స్క్రీన్ప్లే మెయిన్ పార్ట్గా ఉంటాయి. మా చిత్రాన్ని కూడా ప్రతి ఒక్కరూ తల తిప్పకుండా చూస్తారు. మురళీ శర్మ, దేవ్గిల్ సినిమాకి పెద్ద అసెట్ అవుతారు. అలాగే భద్రం, రచ్చరవి కామెడీ టైమింగ్కి కడుపుబ్బ నవ్వుకుంటారు. క్రిష్ కొత్త వాడైనాచాలా బాగా చేశాడు. అష్మిత, త్రిషలు ఈ థ్రిల్లింగ్ చిత్రానికి గ్లామర్ అందించారు. ఉజ్జల్ అందించిన సంగీతానికి 'బిగ్బాస్ 3' విజేత రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ తమ గాత్రంతో ఆడియోకి క్రేజ్ తీసుకొచ్చారు. ప్రస్తుతం ఒక సాంగ్ మినహ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్ర ఆడియోని త్వరలో విడుదల చేస్తాం. అలాగే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సమ్మర్ కానుకగా రిలీజ్ చేస్తాం. గతంలో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలతో పోలిస్తే కచ్చితంగా ఇది చాలా భిన్నమైన చిత్రం. అన్ని వర్గాలకు కావాల్సిన అంశాలన్ని ఉన్న ఈ చిత్రం తప్పకుండా అందర్ని ఆకట్టకుంటుంది' అని అన్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్: ఉజ్జల్, కెమెరా: హజరతరు(వలి), ఎడిటర్: హరీష్.