Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రానా, సాయిపల్లవి ప్రధాన పాత్రధారులుగా వేణు ఉడుగుల దర్శకత్వంలో పీరియాడికల్ చిత్రంగా 'విరాటపర్వం' రూపొందుతుంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రంలో టబు కీలక పాత్ర పోషిస్తుంది. మరో విలక్షణ నటి నందితా దాస్ ఇందులో మరో ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఆమె మంగళవారం నుంచి షూటింగ్లో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలను దర్శకుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. షూటింగ్లో జాయిన్ అయిన సందర్భంగా నందితా దాస్ స్పందిస్తూ, 'ప్రస్తుతం నేను, దర్శకుడు వేణు ఉడుగుల, సినిమాటోగ్రాఫర్ డానీతో కలిసి 'విరాటపర్వం' సెట్లో ఉన్నా. తెలుగులో మాట్లాడాలన్న ఒత్తిడి కన్నా సెట్స్లో ఉండటం నాకెప్పుడూ సంతోషంగా ఉంటుంది' అని ట్వీట్ చేశారు. దీనికి దర్శకుడు వేణు ప్రతిస్పందిస్తూ, 'మీతో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్యూ నందితా మేడమ్' అని పేర్కొన్నారు. 1980-90లో తెలంగాణ ప్రాంతంలోని సామాజిక పరిస్థితులను ఆధారంగా చేసుకుని పీరియాడికల్ పొలిటికల్ థ్రిల్లర్గా నక్సలైట్స్ ఉద్యమం నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిది.