Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంధ్య థియేటర్లో ప్రొజెక్టర్గా పనిచేసిన టి.మహిపాల్రెడ్డి దర్శకుడిగా మారుతూ 'పోస్టర్' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. శ్రీ సాయి పుష్పా క్రియేషన్స్ పతాకంపై టి.శేఖర్రెడ్డి, ఏ.గంగారెడ్డి, ఐ.జి.రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విజరు ధరన్, రాశి సింగ్, అక్షత సోనావానే హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్ర టీజర్ని ప్రముఖ నిర్మాత సురేష్బాబు మంగళవారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'టీజర్ చూశాక మహిపాల్ రెడ్డి ప్రతిభ ఏంటో అర్ధమైంది. తనకిదే తొలి సినిమా అయినా ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిలా గ్రాండ్గా తెరకెక్కించారు. టీజర్ చూస్తుంటే ధియేటర్ నేపథ్యంలో తీసిన సినిమా అని అర్ధమవుతుంది. ప్రేక్షకులను థియేటర్కి రప్పించే అంశాలు మెండుగా ఉన్నాయి. ఈ టీజర్, చిత్ర టీమ్ స్పిరిట్ చూసాక సినిమా మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం కలుగుతుంది' అని అన్నారు. 'మా సినిమా టీజర్ సురేష్ బాబు చేతుల మీదుగా విడుదల అవ్వడం చాలా ఆనందంగా ఉంది. వారికి టీజర్ నచ్చడమే మా సినిమా తొలి విజయంగా భావిస్తున్నాం. ప్రతి ఇంట్లో జరిగే కథనే సినిమాగా తీశాను. పోస్టర్ అంటించడానికి కూడా పనికి రాని ఒక వ్యక్తి, పోస్టర్ మీదకు ఎక్కే స్థాయికి ఎలా ఎదిగాడనేది సినిమా. సమస్యలు అనేవి అన్నింట్లో ఉంటాయి. వాటిని అధిగమించి ముందుకు వెళ్లగలిగితే లైఫ్ ఎంతో బాగుంటుంది. అంతే కానీ చిన్న విషయాలకే క్రుంగి పోయి ఆత్మ హత్యలు చేసుకోవద్దని అంతర్లీనంగా చెప్పే ప్రయత్నం చేశాం. సినిమా ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాల్లో ఉంది. ఇటీవల రాహుల్ సిప్లిగంజ్ పాడిన పాట రిలీజ్ చేసాం. మంచి రెస్పాన్స్ వస్తుంది' అని దర్శకుడు మహిపాల్రెడ్డి చెప్పారు. హీరో విజరు మాట్లాడుతూ, 'జీరో నుంచి ఒక వ్యక్తి హీరోగా ఎలా ఎదిగాడన్నదే ఈ సినిమా' అని చెప్పారు. శివాజీ రాజా, మధుమణి, రామరాజు, కాశీ విశ్వనాథ్, స్వప్నిక, అరుణ్ బాబు, జగదీశ్వరి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శాండీ అద్దంకి, కెమెరా: రాహుల్, ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్.