Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ గడగడలాడిస్తోంది. దీని వ్యాప్తిని నిరోధించేందుకు ప్రపంచ దేశాలన్ని విస్తృతంగా శ్రమిస్తున్నాయి. మన దేశం కూడా ఈ మహమ్మారిని తరిమి కొట్టేందుకు శాయశక్తుల కృషి చేస్తోంది. ఇందులో భాగంగా వచ్చే నెల 14వ తేదీ వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ని ప్రకటించాయి. దీంతో జన జీవనం అస్తవ్యస్తమైంది. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి ఉన్న ఏకైక మార్గం ప్రజలందరూ ఇంటికే పరిమితమవ్వడం.
లాక్డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా సినిమా, టెలివిజన్ షూటింగ్లన్ని బంద్ అయ్యాయి. షూటింగ్లు లేకపోవడంతో ఆ రోజు పని చేస్తే తప్ప రోజు గడవని లక్షలాది సినీ కార్మికులు, కళాకారుల జీవితాలు దయనీయంగా మారాయి. టాలీవుడ్ సినీ కార్మికులు సైతం ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వీరితోపాటు సామాన్య ప్రజలను కూడా కరోనా వైరస్ బారి నుంచి తప్పించడం కోసం, వారిని ఆర్థికంగా ఆదుకోవడం కోసం యావత్ తెలుగు చిత్ర పరిశ్రమ ఓ అడుగు ముందుకేసి భారతీయ సినీ రంగానికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది.
సాయానికి హీరోయిన్లు దూరం..!
టాలీవుడ్కి చెందిన పలువురు అగ్ర హీరోలు, దర్శకులు, నిర్మాతలు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి, సినీ కార్మికులు, కళాకారుల కోసం భారీ విరాళాలను ప్రకటించారు. అయితే ఇంతవరకు ఒక్క హీరోయిన్ కూడా సాయం చేస్తున్నట్టు ప్రకటించిక పోవడం గమనార్హం.
కరోనా నివారణ చర్యల కోసం
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధితోపాటు
సినీ కార్మికులు, కళాకారుల కోసం భారీ విరాళాలు ప్రకటించిన
తెలుగు చిత్ర ప్రముఖుల వివరాలు..
చిరంజీవి : కోటి రూపాయలు
పవన్కళ్యాణ్ : రూ. 2 కోట్లు (కేంద్ర ప్రభుత్వానికి కలిపి)
మహేష్బాబు : కోటి రూపాయలు
ప్రభాస్ : కోటి రూపాయలు
ఎన్టీఆర్ : రూ. 75 లక్షలు
రామ్చరణ్ : రూ. 70 లక్షలు
సాయి తేజ్ : రూ. 25 లక్షలు
వి.వి.వినాయక్ : రూ. 5 లక్షలు
త్రివిక్రమ్ : రూ. 20 లక్షలు
కొరటాల శివ : రూ. 10 లక్షలు
అనిల్ రావిపూడి : రూ. 10 లక్షలు
దిల్ రాజు : రూ. 20 లక్షలు
'నాంది' చిత్ర టీమ్ అల్లరి నరేష్, సతీష్ వేగేశ : తమ చిత్ర యూనిట్ 50 మంది కార్మికులకు ఒక్కొక్కరికి రూ. 10 వేలు.