Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మంచు విష్ణు ప్రస్తుతం 'మోసగాళ్లు' అనే హాలీవుడ్-ఇండియన్ సినిమా చేస్తున్న విషయం విదితమే. ఈ చిత్రం కోసం ఆయన కూకట్పల్లిలో సుమారు రూ. 3.5 కోట్ల వ్యయంతో ఒక భారీ ఐటీ ఆఫీస్ సెట్ని నిర్మించారు. ఇప్పుడక్కడ ఎడారి వాతావరణం కనిపిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ కుంభకోణం నేపథ్యంతో రూపొందుతున్న 'మోసగాళ్లు' సినిమా షూటింగ్ 2019 మొదట్లో ఆరంభమైంది. లాస్ ఏంజెల్స్, హైదరాబాద్ ప్రాంతాల్లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటూ వస్తున్న షూటింగ్ కరోనా వైరస్ కట్టడిలో భాగంగా లాక్డౌన్తో పూర్తిగా ఆగిపోయింది. విష్ణుతో పాటు కాజల్ అగర్వాల్, బాలీవుడ్ స్టార్ యాక్టర్ సునీల్ శెట్టి తదితరులతో ప్రధాన సన్నివేశాలు, క్లైమాక్స్ యాక్షన్ సీన్లు దాదాపు పూర్తయ్యాయి. అయితే, చిత్రానికి అతి కీలకమైన ఐటీ ఆఫీస్ సీన్లు
లాక్డౌన్ కారణంగా నిరవధికంగా ఆగిపోయాయి. 'మోసగాళ్లు' చిత్రీకరణ ఆగిపోయిన విషయాన్ని చిత్ర బందం ధ్రువీకరిస్తూ, ప్రతి యూనిట్ మెంబర్స్ క్షేమం దష్ట్యా చిత్రీకరణ నిలిపివేశాం. ప్రస్తుతం దేశం ఎదుర్కొటున్న విపత్కర పరిస్థితి మెరుగై, సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాక చిత్రీకరణ కొనసాగిస్తామని తెలిపింది. ప్రపంచవ్యప్తంగా కరోనా వైరస్ వల్ల ప్రభావితులైన వారు త్వరగా కోలుకోవాలని మంచు విష్ణు ఆకాంక్షించారు. ప్రజలందరూ ప్రభుత్వ సలహాలు, సూచనలను కచ్చితంగా పాటించాలని ఆయన కోరారు. అందరూ సామాజిక దూరం పాటిస్తూ, స్వీయ క్వారంటైన్ను అమలు చేయాలన్నారు. హాలీవుడ్కు చెందిన జెఫ్రీ గీ చిన్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది వేసవికే ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.