Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ మన కోసం
దాతృత్వంలోనే కాదు సినీ కార్మికులను కంటికి రెప్పలా కాపాడుకునే విషయంలోనూ యావత్ ప్రపంచ సినీ పరిశ్రమకు
తెలుగు చిత్ర పరిశ్రమ స్ఫూర్తిగా నిలవడం హర్షించదగ్గ పరిణామం.
కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి కోసం లాక్డౌన్ ప్రకటించడంతో షూటింగులు లేక సినీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబాల్ని పోషించలేని దయనీయ స్థితిలో ఉన్న సినీ కార్మికులను ఆదుకునేందుకు చిరంజీవి ఆధ్వర్యంలో తెలుగు చిత్ర పరిశ్రమ
'కరోనా క్రైసిస్ ఛారిటీ..మన కోసం' (సి.సి.సి)ని ఏర్పాటు చేసింది.
కరోనా మహమ్మారి ప్రభావం వివిధ రంగాలపై తీవ్రంగా పడింది. దీని బారి నుంచి ప్రజలను కాపాడటానికి ఇప్పటికే హీరోలు, నిర్మాతలు, దర్శకులు నుంచి విరాళాలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ సంక్షోభం నుంచి సినిమా రంగాన్ని బయటపడేయటానికి సినీ ప్రముఖులు కంకణం కట్టుకున్నారు. నిర్మాణాత్మక కార్యక్రమాల వైపు దష్టి సారించారు. దీని కోసం కరోనా క్రైసిస్ ఛారిటీ..మన కోసం (సి.సి.సి) అనే సంస్థను చిరంజీవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.
దీని గురించి నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ,' కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా సష్టిస్తున్న కలకలాన్ని మనందరం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఈ సమయంలో సినిమా పరిశ్రమలో ఉన్న కార్మికులు చాలా మంది చాలా ఇబ్బందులకు లోనవుతున్నారు. ఎలాంటి విపత్తులు సంభవించినా సహాయం చేయడంలో సినిమా ఇండిస్టీ ముందుంటుంది. ఇప్పుడు కూడా సోదర నటీనటులు విరాళాలు ప్రకటించి తమ గొప్ప మనసును చాటుకున్నారు. అయితే మన సోదర కార్మికులకి మనం ఏం చేయగలం అని చిరంజీవి ఓ ఆలోచనతో ముందుకు వచ్చారు. చిరంజీవి ఆధర్యంలో సురేష్బాబు, నేను, ఎన్.శంకర్, కల్యాణ్, దాము అందరం కలిసి చిన్న కమిటీగా ఏర్పాటై సీసీసీ అనే సంస్థ ద్వారా చిత్ర పరిశ్రమ కార్మికుల సంక్షేమార్థం పలు కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించాం. దీనికి నాందిగా మొదట చిరంజీవి కోటి రూపాయలను ప్రకటించారు. నాగార్జున సైతం కోటి రూపాయలు, వెంకటేష్ కోటి రూపాయలు, మహేష్బాబు రూ. 25 లక్షలు, ఎన్టీఆర్ రూ. 25 లక్షలు, రామ్చరణ్ రూ.30 లక్షలు, నాగచైతన్య రూ.25 లక్షలు, కార్తీకేయ రూ.2 లక్షల రూపాయల్ని విరాళంగా ప్రకటించారు' అని తెలిపారు.
'కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న ఈ సందర్భంలో తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించిన వేలాది మంది కార్మికులకు అండగా నిలబడాలనే సంకల్పంతో చిరంజీవి గారి ఆధ్వర్యంలో సి. సి. సి. (కరోనా క్రైసిస్ ఛారిటీ మనకోసం) అనే సంస్థని ఏర్పాటు చేశాం. ఈ సంస్థకి ఛైర్మన్గా చిరంజీవి ఉంటారు. సి. సి. సి. మనకోసం కమిటీతో పాటు డైరెక్టర్ మెహర్ రమేష్, గీతా ఆర్ట్స్ బాబు, కోటగిరి వెంకటేశ్వరరావు, పరుచూరి గోపాలకష్ణ, కొమరం వెంకటేష్, ఫెడరేషన్కు సంబంధించి అన్ని కార్మిక సంఘాల నాయకులు కూడా ఈ సేవా కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు. ప్రజలందరూ కూడా స్వయంగా ఇంట్లోనే కరోనా వైరస్తో సైనికుల్లా పోరాడుతున్న సందర్భంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతత్వంలో కరోనా వైరస్ మీద అద్భుతమైన పోరాటం జరుగుతోంది. మీ ఇళ్ళలోనే ఉంటూ కనబడని శత్రువుతో పోరాడండి. విజయం సాధిద్దాం. మా ఈ సేవా కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులు, పురపాలక ఐటీ శాఖామంత్రి కేటీఆర్ అండదండలు, అధికారులు, పోలీస్ శాఖ వారి సహాయసహకారాలు కావాలని కోరుతున్నాం' అని దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్.శంకర్ చెప్పారు.