Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా వైరసి వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏప్రిల్ 15 వరకు లాక్డౌన్ని ప్రకటించిన విషయం విదితమే. దీని కారణంగా సినిమా షూటింగ్లు బంద్ అవ్వడంతో దినసరి వేతనంతో పని చేసే సినీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరిని ఆదుకునేందుకు చిరంజీవి ఆధ్వర్యంలో 'కరోనా క్రైసిస్ ఛారిటీ' మన కోసం (సి.సి.సి) సంస్థని ఏర్పాటు చేసిన విషయం విదితమే. సినీ కార్మికుల సంక్షేమం దృష్ట్యా ఏర్పాటైన ఈ సంస్థకు తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులు, సాంకేతిక నిపుణులు, దర్శక, నిర్మాతలు తమ వంతు సాయంగా విరాళాలు ప్రకటిస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం కథానాయకుడు రవితేజ రూ. 20 లక్షలు, అక్కినేని నాగచైతన్య రూ. 25 లక్షలు, శర్వానంద్ రూ. 15 లక్షలు, వరుణ్ తేజ్
రూ. 20 లక్షలు, సాయితేజ్ రూ.10 లక్షలు, వెన్నెల కిషోర్ రూ. 2 లక్షలు, విశ్వక్సేన్ రూ.5 లక్షలు, కార్తీకేయ రూ. 2 లక్షలు, లావణ్యా త్రిపాఠి రూ. 1 లక్ష, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్రాజు రూ.10 లక్షల రూపాయల్ని సి.సి.సి.కి అందజేస్తున్నట్టు తెలిపారు.
ఇదిలా ఉంటే, శర్వానంద్ కథానాయకుడిగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'శ్రీకారం'.
కరోనా కట్టడి కోసం అహర్శిశలు రోడ్లపై శ్రమిస్తున్న పోలీస్ అధికారులకు
ఫుడ్ ప్యాకెట్స్తోపాటు వాటర్ బాటిల్స్ని అందజేశారు.అలాగే 'షార్ట్ టెంపర్'
చిత్ర బృందం తమ చిత్రయూనిట్ సభ్యులందరికీ నెల రోజుల పాటు సరిపడా
నిత్యావసర వస్తువులను పంపిణీ చేసింది. ''కరోనా వైరస్ వ్యాప్తి ఉధతంగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం విధించిన లాక్డౌన్ను తప్పనిసరిగా పాటిస్తూ, అందరూ తమ ఇళ్లల్లోనూ సురక్షితంగా ఉండాలి. ప్రభుత్వాలు, వైద్యులు ఎప్పటికప్పుడు అందిస్తున్న సలహాలు, సూచనలను పాటించాలి. ఇంటికే పరిమితమైతే దేశాన్ని రక్షించినవాళ్ళు అవుతారు.
లాక్డౌన్ కారణంగా సినీ కార్మికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వారి సంక్షేమం దృష్ట్యా చిరంజీవి ఆధ్వర్యంలో సి.సి.సి. మన కోసం సంస్థను ఏర్పాటు చేయడం అభినందనీయం. కార్మికుల రక్షణ ధ్యేయంగా మేం సైతం మా వంతు సాయాన్ని ప్రకటిస్తున్నాం. అలాగే మరికొంత మంది సాయం అందిస్తారని కూడా ఆశిస్తున్నాం.
ఇకపై కూడా ఈ సంస్థకి మా పూర్తి సహకారం ఉంటుంది' అని రవితేజ పేర్కొన్నారు.
బుల్లితెర కార్మికుల కోసం..
కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న విషయం విదితమే. దీని బారి నుంచి తప్పించుకోవడానికి అన్ని దేశాలు విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో భాగంగా మన దేశం సైతం కరోనాపై పోరాడుతోంది. ఏప్రిల్ 15 వరకు ఉన్న లాక్డౌన్ కారణంగా టెలివిజన్ షూటింగులు కూడా బంద్ అయ్యాయి. దీంతో చాలా మంది బుల్లితెర కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. నా వంతు సాయంగా 60 కార్మికుల కుటుంబాలకు నెల రోజుల పాటు ఆర్థికంగా సాయం అందించబోతున్నాను.
- యాంకర్ ప్రదీప్