Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రస్తుతం ప్రభాస్ సరసన ఓ చిత్రం, అఖిల్కి జోడిగా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్', సల్మాన్ ఖాన్తో 'కభీ ఈద్.. కభీ దివాలి' వంటి తదితర చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న పూజా హెగ్డే లేటెస్ట్గా ఓ బంపర్ ఆఫర్ని అందుకున్నట్టు సమాచారం. తమిళనాట సూర్య, దర్శకుడు హరి కాంబినేషన్కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'సింగం' సిరీస్ విశేష ప్రేక్షకాదరణ పొంది సంచలన విజయాలు సాధించాయి. అలాగే కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షమూ కురిపించాయి. మళ్ళీ ఈ కాంబినేషన్లో ఓ కొత్త సినిమా తెరకెక్కబోతోంది. 'అరువ' పేరుతో రూపొందబోయే ఈచిత్రంలో సూర్య సరసన పూజాని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. గతంలో రష్మిక మందన్నా పేరు వినిపించినప్పటికీ తాజాగా పూజాని ఫైనల్ చేసినట్టు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే, పూజా ఈ సినిమాతో పాటు ఓ మహిళా ప్రధాన చిత్రంలోనూ నటించేందుకు పచ్చా జెండా ఊపినట్టు సమాచారం.