Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'పెద్దల మాటలను గౌరవించకపోతే విపత్కర పరిణామాలు ఎదురవుతాయని మన భారత, భాగవత, రామాయణ గాథలు తెలియజేశాయి. పెద్దలు చెప్పిన దాన్ని వినకపోతే ఏం జరుగుతుందో ప్రస్తుతం కనిపిస్తోంది. అలాగే కనీసం ఇకనైనా ప్రకృతిని గౌరవించడం నేర్చుకోండి' అని మోహన్బాబు అన్నారు.
కరోనా వైరస్ నుంచి తప్పించుకోవాలంటే ప్రధాని మోదీ దగ్గర్నుంచి పెద్దలు చెబుతున్న సూచనలను పాటించాలని ఆయన వీడియో రూపంలో ప్రజలను కోరారు.
'ప్రక తిని గౌరవించాలని ఇప్పటికైనా మీకు అర్థమై ఉంటుంది. ఏదో ఒక మహత్తర శక్తి మనల్ని నడిపిస్తున్న సంగతీ అర్థమై ఉంటుంది. పెద్దల మాటలను గౌరవించకపోతే ఏం జరుగుతుందో కూడా మీకు తెలిసి ఉంటుంది. భారత, భాగవత, రామాయణ గాథలను మీరు చదివే ఉంటారు. వీటిల్లో వాలి, సుగ్రీవుల కథ, సీత, లక్ష్మణుల మధ్య జరిగే సంఘటనలు.. ఇవన్ని వీటినే సూచిస్తాయి. ప్రధాని నరేంద్ర మోడీ దగ్గర్నుంచి ప్రతి ఒక్కరూ 'మీరు ఇంట్లో ఉండండి, సురక్షితంగా ఉండండి.. ఎన్ని రోజులు లాక్డౌన్ ఉంటే అన్ని రోజులు ఇంట్లో ఉండండి.. భగవంతుడ్ని ప్రార్థించండి.. ఈ కరోనా వ్యాధి వెళ్లిపోవాలని ప్రార్థించండి. బయటకు వచ్చి ఇష్టమొచ్చినట్లు నడచుకోకండి' అని చెప్తున్నా ఎవరూ వినడం లేదు. వాళ్ల ఇష్టప్రకారం నడుచుకుంటున్నారు. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. పెద్దలను గౌరవించినప్పుడే మనం బాగుంటాం, పక్కింటివాళ్లూ బాగుంటారు. రాష్ట్రం బాగుంటుంది, యావత్ ప్రపంచమూ బాగుంటుంది. అతి త్వరలో ఈ కరోనా నుంచి మనందరం తప్పించుకుని క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నా' అని చెప్పారు.