Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కృష్ణ నట ప్రస్థానానికి నాంది పలికిన 'తేనె మనసులు' చిత్రం విడుదలై మంగళవారానికి సరిగ్గా 55 ఏండ్లు పూర్తయ్యింది. 31-3-1965లో విడుదలైన ఈ చిత్రానికి ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించారు. ముళ్ళపూడి వెంకటరమణ కథ అందించిన ఈ చిత్రం అప్పట్లో విశేష ప్రేక్షకాదరణ పొందింది. అంతేకాదు శతదినోత్సవాన్ని జరుపుకున్న చిత్రం కూడా. కృష్ణ, రామ్మోహన్, సంధ్యారాణి, సుకన్య నాయకానాయికలుగా నటించిన ఈ చిత్రానికి కె.వి.మహదేవన్ సంగీతాన్ని సమకూర్చారు. ఈ 55 సంవత్సరాల సినీ ప్రయాణంతో నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా అన్నింటికి మించి ప్రయోగాలు చేసే డాషింగ్ హీరోగా, నిర్మాతగా కృష్ణ పేరు తెచ్చుకున్నారు.
'నా ఆల్టైమ్ ఫేవరేట్ సినిమా 'తేనె మనసులు'. సమయంతో సంబంధంలేని ఓ క్లాసిక్. 55 ఏండ్ల క్రితం సూపర్స్టార్ కృష్ణ సినీ ప్రయాణం ఈ చిత్రంతోనే ఆరంభమైంది. బ్లాక్ బస్టర్ బిగినింగ్. మరొక్కసారి ఆ క్షణాల్లోకి వెళ్ళి వద్దాం' అంటూ కృష్ణ తనయుడు మహేష్బాబు ట్వీట్ చేశారు.