Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలకృష్ణ, రానా కథానాయకులుగా నటించబోయే మల్టీస్టారర్ సినిమాకి సంబంధించిన వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. గతంలో వీరిద్దరూ 'ఎన్టీఆర్' బయోపిక్లో కొన్ని సన్నివేశాల్లో మెరిసిన విషయం విదితమే. అయితే లేటెస్ట్గా వీరిద్దరి కాంబినేషన్లో ఓ చిత్రాన్ని రూపొందించేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. పృధ్వీరాజ్ కథానాయకుడిగా నటించిన 'అయ్యప్పానుమ్ కొషియుమ్' మలయాళ చిత్ర రీమేక్లను ఈ సంస్థ సొంతం చేసుకున్న విషయం విదితమే. ఈ చిత్ర రీమేక్లో బాలకృష్ణ, రానా కాంబినేషన్ అయితే బాగుంటుందని చిత్ర బృందం వీళ్ళని ఎప్రోచ్ అవ్వగా, వీరిద్దరూ గ్రీన్ సిగల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అలాగే వీరిద్దరిని ఎవరు డైరెక్ట్ చేస్తారనే విషయం కూడా త్వరలోనే తెలియనుందట. బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఓ సినిమాలో నటిస్తున్నారు. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన 'సింహ', 'లెజెండ్' చిత్రాలు బ్లాక్బస్టర్స్గా నిలిచాయి. అలాగే రానా 'అరణ్య', 'విరాటపర్వం' చిత్రాల్లో నటిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి కోసం ప్రకటించిన లాక్డౌన్తో ఈ చిత్రాల షూటింగ్ ఆగిపోయింది. మొత్తమ్మీద త్వరలోనే బాలకృష్ణ, రానా వంటి డిఫరెంట్ కాంబినేషన్ ప్రేక్షకుల ముందుకు రాబోతోందన్నమాట.