Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా మహమ్మారి వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్న వలస కార్మికుల బాధ వర్ణనాతీతం. లాక్డౌన్ వల్ల గత రెండు నెలలుగా ఉన్న చోట పని చేయలేక, స్వస్థలాలకు వెళ్ళలేక పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. వలస కార్మికుల బాధలపై దర్శకుడు హరీశ్శంకర్ సోషల్ మీడియాలో స్పందిన తీరు అందరి మనసుల్ని కదిలిస్తోంది.
బండరాళ్లను పిండి చేసిన చేతులు
ఎడమపక్క డొక్క నొప్పికి లొంగిపోయాయి
పెద్ద పెద్ద ఇనుప చువ్వలను వంచిన వేళ్ళు
మెత్తని పేగుల ముందు ఓడిపోయాయి
మేం వేసిన రోడ్లే మమ్మల్ని వెక్కిరిస్తుంటే
బతకడం కోసం ఊరొదిలొచ్చిన మేము
చచ్చేలోపు ఊరెళ్తే చాలనుకుంటూ
ఆకలి అడుగులతో..
పేగుల అరుపులతో..
కాళ్ళూ, కడుపు ఒకేసారి కాలుతుంటే..
మమ్మల్ని చూసే లోకులకు
బాధేస్తోంది..
జాలేస్తోంది..
కానీ మాకు మాత్రం 'ఆకలేస్తోంది'!!
నిస్సహాయతతో..
- హరీశ్ శంకర్ (దర్శకుడు)