Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఏ మాయ చేశావే' చిత్రంతో తెలుగు ప్రేక్షకులను
మెస్మరైజ్ చేసిన నాగచైతన్య, సమంత జంట తాజాగా మళ్ళీ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కబోయే చిత్రంలో మెరవబోతున్నారని సమాచారం. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన 'ఏ మాయ చేశావే' సినిమా తెలుగులో సమంతకు తొలి చిత్రం కాగా, నాగచైతన్యకు రెండవ చిత్రం. ఈ సినిమా సమయంలోనే స్నేహితులుగా మారిన చైతూ, సమంత ఆ తర్వాత ప్రేమలో పడి, పెళ్లి కూడా చేసుకున్నారు. పెళ్ళి తర్వాత వీళ్ళిద్దరూ కలిసి 'మజిలి' చిత్రంలో నటించారు. ప్రేక్షకుల విశేష ఆదరణతో ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత సమంత నటించిన 'ఓ బేబీ' చిత్రంలో కూడా అతిథి పాత్రలో చైతూ అలరించారు. ప్రస్తుతం 'ఏ మాయ చేశావే' చిత్రానికి సీక్వెల్ తీయాలనే యోచనలో ఉన్నట్టు గౌతమ్ మీనన్ ఇటీవల ప్రకటించారు. తమిళంలో తొలిభాగంలో నటించిన శింబు, త్రిష ఈ సీక్వెల్లో కూడా సందడి చేయనున్నారు. అలాగే తెలుగులో కూడా తొలి భాగంలో నటించిన చైతూ, సమంత నటించబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.