Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహేష్బాబు నటించబోయే తదుపరి చిత్రం ఖరారైంది. ఆయన 27వ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతోంది. 'గీత గోవిందం' ఫేమ్ పరశురాం ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. నేడు (ఆదివారం) కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మహేష్ ఈ శుభవార్తను ఫ్యాన్స్కు తెలిపారు. అలాగే నేటి ఉదయం 9.09లకు ఓ సర్ప్రైజ్ కూడా ఇవ్వబోతున్నారు. 'మహేష్తో కలిసి మరో సినిమా కోసం పని చేస్తున్నాం. మీరు ఈ చిత్రం గురించి ఎన్నో విన్నారు. ఇప్పుడు అసలు నిజం తెలియడానికి సమయం దగ్గర పడింది' అంటూ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ సోషల్ మీడియా వేదికగా తెలిపింది. జీఎంబీ ఎంటర్టైన్మైంట్స్, 14 రీల్స్ సంస్థలు కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం వహిస్తున్నాయి. ఆదివారం ఈచిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకి 'సర్కారి వారి పాట' అనే టైటిల్ను చిత్ర బృందం పరిశీలిస్తున్నట్టు సమాచారం. అభిమానులతోపాటు అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే స్థాయిలో ఈ సినిమా ఉండబోతుందని దర్శకుడు పరశురాం ఇప్పటికే తెలిపిన విషయం విదితమే.