Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'అలనాటి మహానటి సావిత్రి జీవితం ఆధారంగా రూపొందిన 'మహానటి' చిత్రాన్ని చూశా. చాలా బాగా నచ్చింది. వెంటనే మీరూ చూడండి' అంటూ బాలీవుడ్ స్టార్ కథానాయిక దీపికా పదుకొనె సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. 2018లో విడుదలైన 'మహానటి' చిత్రం ప్రేక్షకుల విశేష ఆదరణతో అఖండ విజయం సాధించింది. అలాగే విమర్శకులతోపాటు ప్రముఖుల ప్రశంసల్నీ సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో సావిత్రిగా నటించిన కీర్తిసురేష్ జాతీయ ఉత్తమ నటిగా ప్రతిష్టాత్మక పురస్కారాన్ని సొంతం చేసుకుంది. అంతేకాకుండా ఎన్నో జాతీయ, అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై అందరినీ అలరించింది. దీపికా పెట్టిన ట్వీట్కి, 'తెల్లవారు జామున కూల్ నోటిఫికేషన్తో నిద్ర లేచా'నని 'మహానటి' దర్శకుడు నాగ్ అశ్విన్ రిప్లై ట్వీట్ పెట్టారు.
ఇదిలా ఉంటే, ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో రూపొందబోయే పాన్ వరల్డ్ సినిమాలో దీపికా పదుకొనే నటించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని వినిపిస్తోంది. అందుకే నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన 'మహానటి' చిత్రాన్ని దీపికా చూసినట్టు తెలుస్తోంది.