Authorization
Mon Jan 19, 2015 06:51 pm
షూటింగ్లకు అనుమతి ఇవ్వడమే కాకుండా చిత్రీకరణకు అవసరమైన వసతులు కల్పిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కృతజ్ఞతలు తెలిపింది. మే 19వ తేదీన విడుదల చేసిన జీవో నెంబర్ 45 ప్రకారం సినిమా షూటింగ్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన స్థలాల్లో చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ విషయంలో చొరవ చూపి సినిమా చిత్రీకరణకు సహకరించిన ఎపీ స్టేట్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ టి.ఎస్. విజరు చందర్కు కూడా తెలుగు ఫిలిం ఛాంబర్ ధన్యవాదాలు తెలిపింది. స్టూడియోలను నిర్మించడానికి తెలుగు నిర్మాతలకు ఆంధ్రప్రదేశ్లో స్థలాలను కేటాయించాలని నిర్మాతల సంఘం త్వరలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిసి వినతి పత్రాన్ని ఇవ్వబోతున్నట్టు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు నారాయణ్ దాస్ నారంగ్, సెక్రటరీ కెఎల్.దామోదర్ ప్రసాద్ తెలిపారు.